అహ్మదాబాద్: నిండూ నూరెళ్లు తోడుగా నేనుంటానని ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన ఓ భర్త అసలు రంగు బయటపడింది. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలేసి తాళికట్టిన భర్తను నమ్ముకుని ఎక్కడికైనా వచ్చేస్తారు మహిళలు. కాని ఆ మహిళల పట్ల నేటి సమాజంలో దారుణాలే జరుగుతున్నాయి. బయట వ్యక్తుల వల్లే సవాళ్లను ఎదుర్కొనేది కాకుండా ఇంట్లో వాళ్లనుంచే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంతో మంది మహిళలలు తమ భర్తల చేతుల్లో నేటికీ మోసపోతూనే ఉన్నారు.
అధిక కట్నం పేరుతోనే, అక్రమ సంబంధం మూలంగా భర్తలు తమ భార్యలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కాగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అందరినీ కలచివేస్తుంది. ఆ భాగం పనికి రాదని నేను నీతో ఉండనూ మరో పెళ్లి చేసుకుంటానని ఓ మహిళకు తన భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని ఖేడా పట్టణానికి చెందిన సిద్ధిఖీ అలీ సయూద్ కు ఓ యువతితో గతేడాది పెళ్లి జరిగింది. కాగా ఈ సంవత్సరం ఆమె గర్భం దాల్చింది.
అయితే ఆమెకు రీసెంట్ గా యోని వద్ద ఇన్ ఫెక్షన్ వచ్చింది. ఆ విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదు. కాగా ఈ మధ్య ఆమెకు తీవ్ర జ్వరం, వాంతులు తో బాధపడింది. దాంతో ఆ మహిళను అక్టోబర్ 27 న ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఆ మహిళకు చికిత్స అందించారు. కాని ఆ మహిళ భర్త ఆస్పత్రిలోనే ఆమెతో పాటుగా ఆమె తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. పైగా అతనికి రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో భర్యా భర్తల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది.
దాంతో బాదిత మహిళ భర్త మరోపెళ్లి చేసుకుంటానని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిద్రోతున్న తన భార్య వద్దకు వచ్చి గట్టిగా మూడు సార్లు త్రిపుల్ తలాక్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో బాధిత మహిళ ఆస్పత్రి నుంచి బయటకు రాగానే తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా యోనివద్ద ఇన్ ఫెక్షన్ రావడం మూలంగానే అతను తన భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడని విచారణలో పోలీసులు వెళ్లడించారు.