నాగబాబు కొణిదెల. పేరుకు మెగాస్టార్ తమ్ముడైనా.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. నటుడిగా.. నిర్మాతగా.. బుల్లితెర జడ్జిగా రాణిస్తున్నారు. తెలుగు బుల్లితెరకు కామెడీని పరిచయం చేసిందంటే నాగబాబే. ఈటీవీలో జబర్దస్త్ షోతో కామెడీ షోకు నాంది పలికారు. ఇప్పటికీ జబర్దస్త్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జీ తెలుగులోనూ బొమ్మ అదిరింది అనే కామెడీ షోలో జడ్జిగా చేస్తున్నారు నాగబాబు.
కానీ.. అంతటితో ఆయన ఆగలేదు. యూట్యూబ్ లో కూడా చానెళ్లను పెట్టి తెలుగు కామెడీ స్కోప్ ను పెంచుతున్నారు. స్టాండప్ కామెడీ కోసం ఖుషీ ఖుషీగా అనే ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. కరోనా సమయంలో కూడా పది మందికి ఉపాధి కల్పించాలన్న ఆయన సంకల్పం గొప్పది.
ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షోను నాగబాబు అనుకున్నదానికన్నా ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే.. ఖుషీ ఖుషీగా సక్సెస్ ఫుల్ గా నాలుగు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా 5వ ఎపిసోడ్ ను కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద ఖుషీ ఖుషీగా సూపర్ డూపర్ హిట్ అవడంతో నాగబాబు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే.. వెంటనే రెండో సీజన్ ను కూడా ప్రకటించేశారు. మీలో నవ్వించే టాలెంట్ ఉంటే.. ఈ అవకాశం మీకోసమే. వెంటనే మీ ఎంట్రీస్ ను పంపించండి.. అంటూ నాగబాబు మరోసారి ప్రకటించారు. మొత్తానికి బుల్లితెరను నాగబాబు ఏలేస్తున్నారు. ఎంతైనా మెగా బ్రదర్ కదా.