కొండ చిలువ తెలుసు కదా. వామ్మో.. దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాం. అది ఎక్కడుంటే మనం అక్కడికి జీవితంలో వెళ్లం. కొంచెం పెద్దగా ఉండే కొండ చిలువలు అయితే ఏకంగా మనుషులను కూడా మింగేస్తాయి. అంత డేంజర్ అవి. మరి.. అంత డేంజర్ పాములతో ఈ అల్లరి పిల్ల రోహిణి ఆటలేంటి.. అని అనుకుంటున్నారా? ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రోహిణి.. బిగ్ బాస్ తర్వాత రోహిణిలో ఉన్న టాలెంట్ బయటపడింది. బిగ్ బాస్ కంటే ముందు ఎన్నో సీరియళ్లలో నటించినప్పటికీ.. తనకు మాత్రం బిగ్ బాస్ ద్వారానే పాపులారిటీ వచ్చింది. తర్వాత జబర్దస్త్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. జబర్దస్త్ లో ఎక్కువగా రాకింగ్ రాకేశ్ స్కిట్ చేయడంతో పాటు.. కొన్ని పండుగల ఈవెంట్లలోనూ రోహిణి మెరుస్తోంది.
మొత్తానికి రోహిణి బుల్లితెర స్టార్ అయిపోయింది. అందుకే.. తన అభిమానులకు ఇంకా దగ్గరయ్యేందుకు రోహిణి యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ విషయాలతో పాటు.. తను ఎక్కడికెళ్తే అక్కడ వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తోంది.
తాజాగా హైదరాబాద్ లోని ఐకియా షోరూంకు రోహిణి వెళ్లింది. అక్కడే ఉన్న బొమ్మ కొండ చిలువలతో తను ఓ ఆటాడుకుంది. మొత్తానికి ఐకియా షోరూంలో రోహిణి చేసిన రచ్చను మీరే.. మీ కళ్లారా చూసేయండి.