Corona Effect : కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత ఆరు నెలల కాలానికి చెందిన విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా థియేటర్ లు, మల్టీప్లెక్స్ లు 2020 జూలై నుండి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించుకోవచ్చని తెలిపింది.
బ్యాంకుల నుండి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించింది. సినిమా థియేటర్ లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ మారటోరియం కాలపరిమితి వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నది. వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ప్లెక్స్ థియేటర్ లకు లేదని ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక కార్యదర్శి జి విజయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరు
విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించిందని పేర్కొన్నారు.
Corona Effect Jagan govt announces new helping measures for cine industry
My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021