Corona Result: కరోనా వ్యాప్తి చెందుతుంది.. సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. ఇలాంటి సమయంలో కరోనా పరీక్షలు అంటేనే జనం భయపడుతున్నారు.. గంటలకొద్దీ క్యూలైన్స్.. పైగా రిజల్ట్ కరెక్ట్ గా వస్తుందో రాదో కూడా తెలియదు.. ఆర్టి – పీసీఆర్ పరీక్ష చేస్తే మూడు నాలుగు రోజులు పడుతుంది.. అయితే కేవలం రెండంటే రెండు నిమిషాల్లో కరోనాను గుర్తించే పరికరాన్ని కనుగొన్నారు మన భారతీయులు..!!
చెన్నై కీజపక్కం లోని కేజే ఆస్పత్రి పీజీ రీసర్చ్ సెంటర్ పరిశోధకులు కోవిడ్ ట్రాకర్ పేరుతో ఈ తయారు చేశారు.. ఈ పరికరం లో నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. చెయ్యి ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని ఓ సెన్సార్ ల్యాప్ టాప్ కు అనుసంధానించి ఉపయోగించవచ్చు. ఎటువంటి శాంపిల్స్ను అవసరం లేకుండానే ఈ పరీక్ష నిర్వహిస్తారు..
కరోనా పరీక్ష చేసుకునే వ్యక్తి ఈ పరికరంలోని ట్రాక్టర్ పై తన 5 వేళ్ళను ఉంచాలి. రెండు నిమిషాల్లోనే ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయి, రక్త కణాల సంఖ్య అన్ని తెలిసిపోతాయి. దీని ద్వారా జీటా పొటెన్షియల్ లెవెల్స్ కనిపెట్టవచ్చు. వీటి ఆధారంగా ఆ వ్యక్తి కరోనా సోకిందా లేదా అన్న విషయాన్ని గుర్తించవచ్చు అంటున్నారు. ఈ పరికరాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పై ప్రయోగించినట్లు కేజే ఆస్పత్రి పీజీ రీసర్చ్ సెంటర్ పరిశోధకులు హెడ్ కేశవన్ జగదీష్ అని తెలిపారు. ఈ పరికరం 100 శాతం ఖచ్చితమైన రిజల్ట్ ఇస్తుందని.. ఆర్టి – పీసీఆర్ తో పోలిస్తే మరింత కచ్చితత్వంతో, వేగంగా ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.