ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిలకలూరిపేట మండలం మురికిపూడిలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో ఇటీవల రైతులు పిటిషన్ దాఖలు చేశారు. తవ్వకాలకు రెవెన్యూ అదికారుుల నిరంభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వడంపై రైతులు అభ్యంతరం తెలిపారు. తమను బెదిరింపులకు గురి చేసి చట్టవిరుద్దంగా ఎన్ ఓ సీ ఇచ్చారని ఆరోపించారు.
రైతుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు .. మంత్రి విడదల రజనితో పాటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, తహశీల్దార్, సీఐ, ఎస్ఐ లకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణ నేపథ్యంలో కోర్టు తుది నిర్ణయానికి గ్రానైట్ తవ్వకాల లీజు ఖరారు ఉంటుందని హైకోర్టు తెలిపింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..కానీ..