Planets: మకర రాశిలో ఈరోజు ఆరు గ్రహాలు కలిసిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ అరుదైన గ్రహ కలయిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం. ఇలాంటి గ్రహ సంయోగం ఉన్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి 59 ఏళ్లకు ఒకసారి ఏడూ లేదా ఎనిమిది గ్రహాలు ఒకే రాశి లో కలవడం జరుగుతుంది. 2019లో డిసెంబర్ 26 నుంచి 28 వరకు ఈ షష్ఠగ్రహ కూటమి వల్లే కరోనా వచ్చిందనే సంగతి తెలిసిందే.. 1962 ఫిబ్రవరి 4,5 తేదీల్లో ఇలాంటి అష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు 8 గ్రహాలు మకర రాశిలో కలిసాయి. ఆ ఏడాది రష్యా, అమెరికా సంక్షోభంలో చిక్కుకున్నాయి ఈ పరిణామం యుద్ధాలకు దారితీసింది. 2019 డిసెంబర్లో ధనస్సు రాశిలో శశి, కేతు వు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిసాయి..
రాహు, కేతువులు ఈ ఆరు గ్రహాలకు దూరంగా ఉన్నాయి. 1979 సెప్టెంబర్ లో కూడా ఇలాంటి అరుదైన గ్రహ కలయిక జరిగింది. సింహరాశిలో ఐదు గ్రహాలు కలిసాయి. ఆ సమయంలో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవంతో ముస్లిం సమాజంలో ఆందోళనలు చిలరేగాయి. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్లలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగింది. ప్రస్తుతం మకర రాశిలోకి గ్రహ కలయిక వల్ల విపత్కర పరిస్థితులు కలగవచ్చని జ్యోతిష్య పండితులు అంటున్నారు. రానున్న రెండు నెలల కాలంలో కొన్ని విపత్కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చెన్నై మరియు పాకిస్తాన్ లో చాలా ఇరకాటంలో పడవచ్చు అని కూడా అంటున్నారు
భారత్ పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు. మకరం అనేది కర్మ స్థానం…
ఈ రాశిలో ఆరు గ్రహాలు కలవడం అన్నది భౌగోళిక, రాజకీయం పెనుమార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. కుజ, శని, గురు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. పైగా కుజుడికి మకరం ఉచ్చరాశి. ప్రజల్లో తిరుగుబాటుకు ఈ గ్రహ కలయిక తోడ్పడు వచ్చును.
ఈ అరుదైన గ్రహ కలయికపై నారదుడు ఓ గ్రంథం కూడా రాసాడని చెబుతుంటారు ఈ రోజుల్లో ఏర్పడిన గ్రహ కలయిక లాంటిది 59 ఏళ్ల క్రితం ఏర్పడిందని అంటున్నారు.