NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ .. వాళ్లకు మరో సారి నోటీసులు.. ఈ సారి ట్విస్ట్ ఏమిటంటే..?

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముచ్చటగా మూడవ సారీ నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు.  ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు ఒక పర్యాయం వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన అధికారులు ఈ సారి నేరుగా ఇంటికి వెళ్లి నోటీసులు అందజేయడం గమనార్హం. అయితే ఈ నెల 6వ తేదీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు హజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పగా, కశ్చితంగా రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసినట్లుగా తెలుస్తొంది.

YS Viveka Murder case

 

ఇప్పటికే అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు రెండు పర్యాయాలు విచారణ జరిపి వివేకా హత్యకు సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. జనవరి 28న ఒక సారి, ఫిబ్రవరి 24న మరొక సారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే రెండో సారి విచారణ జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి.. సీబీఐ దర్యాప్తు తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. వ్యక్తి టార్గెట్ గా దర్యాప్తు జరుగుతోందని ఆరోపించారు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేసిన తర్వాత మరో సారి సీబీఐ ఆయనను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గత విచారణ పూర్తి అయిన తర్వాత తనను మరో సారి విచారణకు పిలుస్తామని చెప్పలేదని అవినాష్ రెడ్డి మీడియా వద్ద పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి మరో సారి నోటీసులు జారీ చేశారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని కూడా రేపు 6వ తేదీనే కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ నందు  విచారణ కు రావాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఇంతకు ముందు ఈ నెల 12వ తేదీ విచారణకు హజరుకావాలని పేర్కొన్న సీబీఐ.. విచారణను ప్రీపోన్ చేసింది. తండ్రీ తనయులకు ఒకే రోజు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాను విచారణకు అంటూ పిలిచి చివరకు అరెస్టు చేసింది సీబీఐ. ఇంతకు ముందు పలువురు ప్రముఖులను అదే విధంగా చేయడంతో ఈ కేసులోనూ అటువంటి పరిణామం ఏమైనా ఉంటుందా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N