NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎంపికైనట్లు ప్రచురించాలని ఆదేశించిన ఈసీ.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది .. అదేమిటంటే.. ?

DK Aruna: గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రచురించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ)కి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్ లో ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈఓ కు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.

DK Aruna

 

జోగోలాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బీ కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల్లో తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందున ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  .. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2లక్షల 50వేల జరిమానా విధించింది. ఖర్చుల నిమిత్త పిటిషనర్ డీకే అరుణకు రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. కృష్ణమోహన్ రెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన డీకే అరుణ ను 2018 డిసెంబర్ 12 నుండి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నాటి ఎన్నికల్లో గద్వాల నుండి బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్ధిగా కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున డీకే అరుణ పోటీ పడ్డారు. కృష్ణమోహన్ రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ సెక్రెటరీ కార్యాలయంలో హైకోర్టు తీర్పు కాపీ అందజేసి తదనుగుణంగా తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ సెక్రెటరీ నుండి స్పందన రాకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ తరపున గద్వాల నుండి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత డీకే అరుణ బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ ఉన్నారు. ఈసీ లేఖపై డీకే అరుణ స్పందిస్తూ ఈసీ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తాను అసెంబ్లీ సెక్రెటరీని కలవనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. బీజేపీ నేతగా ఉన్న డీకే అరుణ .. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. బీజేపీకి రాజీమానా చేసి కాంగ్రెస్ లో కొనసాగితే ఆమె శాసనసభ సభ్యత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ పార్టీ నేతలు అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవహారం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related posts

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju