Roja Ambati: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంపై మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులు స్పందిస్తూ ఘాటు విమర్శలు చేస్తూ సెటైర్లు వేశారు. పాడుతా తీయగా సెలక్షన్ కమిటీ కూర్చని చర్చించిన తీరులో జనసేన, టీడీపీ సమావేశం ఉందని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
అటు ఆరుగురు, ఇటు ఆరుగురు కూర్చుని చర్చించారని, ఏ విషయంలో చర్చించినా ప్రయోజం ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. అటు అర సున్నా, ఇటు అర సున్నా కూర్చుని జైలులో ఉన్న గుండు సున్నా కోసం చర్చించారని అర్కే రోజా సెటైర్ వేశారు. చంద్రబాబు జైలు నుండి బయటకు రావడం కష్టమని అన్నారు. నిజం తెలిస్తే భువనేశ్వరి కూడా జైలు కెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నారా భువనేశ్వరి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారని రోజా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు కోసమే పని చేశాడని, ప్యాకేజీ స్టార్ అని పవన్ మరో సారి నిరూపించుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సున్నా సున్నా కలిస్తే ఫలితం సున్నాయేనన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ల సమావేశంతో ఏమి లాభమని అన్నారు. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్లాననీ, బలహీనపడ్డ టీడీపీని బలోపేతం కోసం కలిశానని పవన్ చెబుతున్నారనీ, కానీ ప్రజలు ఈ కలయికను హర్షించడం లేదని అన్నారు. లోకేష్ పల్లకి మోయడం కోసం పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకి బెయిల్ రానివ్వడం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడటం హస్యాస్పదంగా ఉందనీ, బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కదా ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమీ కాదని తాము ఎప్పటి నుండో వీళ్లు కలిసే వస్తారని చెబుతూనే ఉన్నామన్నారు. తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతోందన్నారు. ముద్రగడ పద్మనాభంను హింసించినప్పుడు, అరెస్టు చేసినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని అంబటి ప్రశ్నించారు. లోకేష్ అమిత్ షాను కలవడానికి పదే పదే ప్రాధేయపడ్డారని, కానీ నిన్నటి వరకూ లోకేష్ ఎన్ని అబద్దాలు చెప్పాడన్నారు. కిషన్ రెడ్డి ప్రకటనతో లోకేష్ చెప్పినవన్నీ తప్పులని తేలిపోయిందన్నారు. పురందేశ్వరి తప్పుడు విధానాలు కూడా ఇప్పుడు తేలతెల్లం అయ్యాయన్నారు.
తెలుగు రాష్ట్రాలకు తెగులు తెలుగుదేశం పార్టీయేనని, ఇప్పుడు ఆ తెగులు పవన్ కళ్యాణ్ కి కూడా పట్టుకుందన్నారు. అక్రమంగా 45 రోజులు జైలులో పెట్టడం సాధ్యమనా అని ప్రశ్నించారు. ఏ వ్యవస్థని అయినా మేనేజ్ చేసేది చంద్రబాబుయే కదా ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసే కదా చంద్రబాబు తప్పించుకున్నారని అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వల్ల అది సాధ్యం కాదని అన్నారు. రాజమండ్రి టీడీపీ, జనసేన సమావేశంతో జరిగేది ఏమీ లేదన్నారు అంబటి రాంబాబు.
TDP Janasena: ముగిసిన జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ భేటీ .. తీసుకున్న నిర్ణయాలు ఇవీ