MLA Lasya Nanditha: కంట్రోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా వివిధ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత భౌతికకాయానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు.
లాస్య భౌతిక కాయం వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరో పక్క రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లాస్య నందిత నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. లాస్య నందిత అత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ముందుగా లారీ ఢీకొట్టిన తర్వాత రెయిలింగ్ కు తగిలిందని ఏసీపీ చెప్పారని అన్నారు. లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఏసీపీ తెలిపారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
కాగా, పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా ప్రతినిధులు లాస్య నందిత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు లాస్య నందిత అంత్యక్రియలు చేయనున్నారు.
Lasya Nanditha: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం