Health: సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్త్రీలలో ఎముక బలం చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు కూడా. స్త్రీలు తినే ఆహారం బట్టి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని ఆహారాలను తమ డైట్ లో చేర్చుకోవడం ద్వారా రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. దీనిని తొలగించాలంటే ప్రతి రోజు క్యాల్షియం అందాలి. దీనికోసం పాలు మరియు కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
2. మనదేశంలో ఐరన్ లోపంతో చాలామంది మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇక అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. అందువల్ల బెల్లం మరియు నట్స్ వంటివి తీసుకుని కాల్షియన్ని పెంచుకొని ఎటువంటి అనారోగ్య సమస్యలకి గురవ్వకండి.
3. ఆడవాళ్ళలో ఉండే బలహీనతను తగ్గించే ఫోలేట్ నీ పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఆకుకూరలు మరియు పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి.
4. ప్రస్తుత కాలంలో విటమిన్ డి సరిగా అందక అనేక లోపాలు కలుగుతున్నాయి. కాబట్టి విటమిన్ డి అండ్ కూరగాయలు మరియు ఇతర పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
5. ఆడవాళ్ళలో ఇమ్యూనిటీ పెరగడానికి శరీరంలో జింక్ ఉపయోగపడుతుంది. దీనికోసం పాలు మరియు నట్స్, కాయగూరలు వంటివి తీసుకోవడం చాలా ముఖ్యం.
పైన చెప్పిన పోషకాహారాన్ని ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకుని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందండి.