అమరావతి: జర్నిలిస్ట్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సానుకూలంగా స్పందించారని ఐజెయు అధ్యక్షుడు దేవులపల్లి అమర్ వెల్లడించారు. ఐజెయు అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎపియుడబ్ల్యుజె అధ్యక్ష, కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చందు జనార్థన్ తదితర ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నిలిస్ట్ల ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్ తదితర సమస్యలపై సిఎం జగన్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై సిఎం జగన్ సానుకూలంగా స్పందించారనీ, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయినట్లేనని అమర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి బృందం సభ్యులు ఆలపాటి సురేష్, అమరనాధ్, నిమ్మజరాజు చలపతిరావు, చావా రవి, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post