భారత దేశంలో గత 24 గంటల్లో దాదాపు 10,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుండి పూర్తిగా సడలింపులు ఇచ్చేసి రిస్క్ చేసిందేమో అన్నట్లు ప్రస్తుత పరిస్థితుల్లో తయారయ్యాయి.
గత రెండు రోజులుగా ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తలుపులు తెరిచి ఉన్న విషయం తెలిసిందే. భక్తులందరూ రెండు నెలల గ్యాప్ తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ ఆలయంలోని ప్రసిద్ధ గోవిందరాజస్వామి గుడిని టిటిడి అధికారులు పూర్తిగా మూసివేశారు.
విషయం ఏమిటంటే గోవిందరాజ స్వామి గుడి లో పనిచేసే ఒక ఉద్యోగికి అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా.. అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ గుడిని వెంటనే మూసివేసి భక్తులను వెనక్కి పంపించారు. అయితే ఈ ప్రభావం మిగతా ఆలయాల మీద మరియు అంతిమంగా శ్రీవారి దర్శనం పైన పడుతుందేమో అని అటు అధికారులతోపాటు భక్త జనులు కూడా కంగారు పడుతున్నారు.