AP High Court : పంచాయతీ రాజ్ panchayat raj శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy ramachandra reddy మీడియా సమావేశాలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం నేడు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని, ఎస్ఈసీ, కమిషనర్ లక్ష్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని ఆంక్షలను విధించింది.
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ మీడియాతో మాట్లాడవద్దంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు సమర్థిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు చేయగా మంగళవారం విచారణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఉత్తర్వులు ఇచ్చేందుకు మంగళవారం కోర్టు సమయం ముగియడంతో బుధవారం హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
తొలుత ఎన్నికలు ముగిసే వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం..పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆదేశాలను రద్దు చేసింది. మీడియాతో మాట్లాడకుండా చూడాలన్న ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో మంత్రి పెద్దిరెడ్డికి పూర్తి స్థాయిలో ఊరట లభించినట్లు అయ్యింది.