ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు స్థానిక ఎన్నికల చుట్టు తిరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిలీజ్ చేసిన ఎన్నికల షెడ్యూల్ కి నిన్న అనుకూలంగా తీర్పు ఇవ్వడం అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి రెడీ అయ్యింది. కరోనా వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పడానికి రెడీ అవుతుంది.
ఇటువంటి తరుణంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోపక్క దూకుడు పెంచారు. తాజాగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్తో భేటీ అయ్యారు. సుమారు ఇద్దరి మధ్య 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ప్రభుత్వ వైఖరి ఏంటి అన్న దానిపై చర్చించుకున్న ట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లు గవర్నర్ కి నిమ్మగడ్డ తెలిపినట్లు సమాచారం.
ఇలాంటి తరుణంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కావాలని ఆటంకాలు కలిగిస్తున్నట్లు కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే లోకల్ ఎన్నికల విషయంలో ఒక పక్కగా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరోపక్క ఎన్నికల నోటిఫికేషన్ రేపు రిలీజ్ చేయడానికి గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బేటి కావటం సంచలనంగా మారింది.