ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ .. పెరుగుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చడానికి రెనో తన డీలర్ షిప్ లను కూడా మెరుగుపరుస్తూ ఉంది.. Renault తాజాగా దేశవ్యాప్తంగా 500 సేల్స్ , 475 సర్వీస్ టచ్ పాయింట్స్ , 200కు పైగా వర్క్ షాపులను నిర్వహిస్తోంది.. 2020 డిసెంబర్ నెలలో భారతదేశంలో మొత్తం నలభై కొత్త కస్టమర్ టచ్ పాయింట్లను ప్రారంభించినట్లు ప్రకటించింది.
తన అన్ని డీలర్ షిప్స్, వర్క్ షాప్స్ లో కస్టమర్లు, సిబ్బంది భద్రత కోసం covid 19 కి సంబంధించిన అన్ని నిబంధనలను కంపెనీ పాటిస్తోంది.. 2020 డిసెంబర్ నెలలో ప్రారంభించిన touch points తో కలిపి గత సంవత్సరం కంపెనీ దేశం మొత్తం 120 ప్రారంభించింది. కస్టమర్ టచ్ పాయింట్స్ ద్వారా కంపెనీ ఉత్పత్తులు కస్టమర్స్ కి తెలుపవచ్చు. అంతే కాకుండా service touch points ద్వారా కంపెనీ పాపులారిటీ మరింత మందికి తెలుస్తుంది. దీని వలన కంపెనీ కి, కస్టమర్స్ కి లాభం. సర్వీస్ టచ్ పాయింట్స్ ద్వారా తన సేవలను మరింత విస్తరించి కస్టమర్స్ మన్నలను పొందుతుంది.
ఈ కొత్త డీలర్ షిప్ కేంద్రాలను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహార్ , హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ,పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, అస్సాం లలో ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.రెనో ఇండియా తన గ్లోబల్ లాంచ్ ప్లాన్ లో భాగంగా 2025 నాటికి 14 కొత్త మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశ పెట్టాలని సన్నాహాలు చేస్తోంది.. కస్టమర్ టచ్ పాయింట్స్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ కానుంది.
ఇది కూడా చదవండి : హ్యుందాయ్ జోరు..!! మరో అరుదైన మైలురాయిని చేరుకుంది..