బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ మాట మాట్లాడితే దాని వెనుకు అనేక విషయాలు దాగుంటాయి. కేసీఆర్ అన్నాడంటే ఎంతో కొంత నిజం ఉండక మానదు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నమాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని నివ్వేర పరుస్తున్నాయి. అసలు కేసీఆర్ మాటల్లో మర్మమేందో ఇప్పుడు ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. ఆయన ఇటీవల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఎవ్వరు పార్టీని వదిలి పోవద్దు.. త్వరలో తెలంగాణలో రాజకీయ మార్పులు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 25 మంది నాతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించి సంచలనం రేపారు.
వాస్తవానికి పరిస్తితులు చూస్తే అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోక్కరు చేజారుతూ హస్తం గూటికి చేరుతున్నారు. రాజకీయ భీష్ముడు అయిన కడియం శ్రీహరి, కే.కేశవరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో చేరుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యాల్లో నిజమెంత ఉందో తెలియదు కాని రాజకీయవర్గాల్లో మాత్రం ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యాల్లో 25మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే నమ్మకశ్యంగా లేదని, కేవలం బీ ఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం లో భాగంగానే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటాడని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్లో ఉన్నకొందరు మంత్రి పదవుల మీద ద్యాసతో కూడా పార్టీ మారేందుకు సిద్దపడ్డారో ఏమో అనేది కూడా అనుమానాలు లేకపోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే గెలిచిన ఎమ్మెల్ల్యేలు ఎవ్వరు చే జారడం ఆసాధ్యం. ఒకవేళ బీ ఆర్ ఎస్ కనుక పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తే మాత్రం ఎమ్మెల్యేలు రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడరని తెలుస్తుంది.
బీజేపీ ఎలాగు తెలంగాణలో పాగా వేయాలని ఊవ్విళూరుతుంది. కాంగ్రెస్లో ఉన్న ఎవ్వరో ఒకరిని సీఎం చేస్తానని మాటిస్తే కొందరు కాంగ్రెస్ను వీడటం ఖాయం. అందుకే అటు బీజేపీ, ఇటు బీ ఆర్ ఎస్ పార్టీలు ఏవైనా కాంగ్రెస్పై చీలిక కోసం పాచిక విసురే అవకాశం లేకపోలేదు. అందుకే కేసీఆర్ ఇటు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎత్తుగడ వేశారేమో, లేక నిజంగానే 25మంది టచ్లో ఉన్నారేమో.. అది కాలమే నిర్ణయిస్తుంది. అందుకు పార్లమెంటు ఎన్నికల తరువాతే తెలంగాణలో రాజకీయ మార్పులు సంభవించే అవకాశాలు ఉండోచ్చు.