కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే… ఓ డాక్టరు మద్యం సేవించి వీరంగం వేసిన కేసు కూడా సీబీఐ కు అత్యంత కీలకం అవుతుంది… ఒకసారి కాదు వారు వారు చేసిన దర్యాప్తు… ఇంకోసారి చేసుకోమని కోర్టు ఆదేశించెంత…. విశాఖలో వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో హైకోర్టు సిబిఐ దర్యాప్తు మీద ఏకంగా అసంతృప్తి వ్యక్తం చేసింది… మరోసారి పూర్తి వివరాలతో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఓ కేసు విషయంలో హైకోర్టు ఇలా సిబిఐ దర్యాప్తు మీద అసంతృప్తి వ్యక్తం చేయడం దాదాపు తొలిసారి..
** అసలు డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తెలుసుకోవాలనుకుంటుంది ఏమిటి? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఆ కేసులో డాక్టర్ సుధాకర్ మద్యం తాగినట్లు పోలీసులు చెబుతుంటే… పోలీసులే తనను నడిరోడ్డు మీద కొట్టి కారులో ఎక్కించినట్లు డాక్టర్ చెబుతున్నారు. దీని తర్వాత పెద్దగా జరిగింది ఏమీ లేదు.
** ఈ కేసు చాలా చిన్నది. పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద… సెక్షన్-3 23 ప్రకారం.. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించాలని సెక్షన్ 353 ప్రకారం మాత్రమే దీనిలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి నిజానిజాలు వెలికితీయడానికి సీబీఐకి ఇచ్చే అంత పెద్ద కేసు కాదు. అయితే హైకోర్టు సుమోటోగా తీసుకొని మరి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం.
** సుమారు నాలుగు నెలల పైగా సీబీఐ ఈ కేసులో అన్ని విషయాలను కూలంకషంగా దర్యాప్తు చేసి సుమారు 80 మంది వరకు విచారణ నిర్వహించి కోర్టుకు నివేదిక సమర్పించింది. డైరెక్టుగా కోర్టు వేసిన సీబీఐ విచారణ కావడంతో డైరెక్ట్గా కోర్టుకు నివేదిక ఇచ్చింది.
** అయితే తాజాగా హైకోర్టు సుధాకర్ కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని చెప్పడం మరో ఆశ్చర్యానికి కారణమైంది. అంతేకాదు అడిషనల్ డీజీ స్థాయి అధికారిని దర్యాప్తు పర్యవేక్షించే లా చూడాలని సూచించడం మరో పెద్ద విషయం.
** సుధాకర్ కేసు పూర్తిగా వ్యక్తిగతమైనది. అక్కడ జరిగిన నేరం పెద్ద క్రైమ్ ఏమీ లేదు. ఈ కేసులో కోర్టుకు ఏమైనా సందేహాలుంటే సిబిఐ దర్యాప్తు అధికారి ని అడిగి తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు దర్యాప్తు పూర్తిగా మొదటినుంచి తీసుకురావాలని, అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షించే అంత పెద్ద కేసు ఏమి ఉందని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ మధ్య ఆంధ్రప్రదేశ్లో యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు మేరకు అధికార పార్టీకి చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కోర్టు ఏం కోరుకుంటుందో దానిని ఏసీబీ అధికారుల చేత నివేదిక ఇప్పించు పోవచ్చు కదా అంటూ.. అధికార పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.