గత కొద్ది కాలంగా ఏపీ ప్రభుత్వం పై న్యాయస్థానం విధానాలు తీవ్రమైన వ్యతిరేకతను చెబుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి అనేకానేక కారణాలు ఉండొచ్చు కానీ ఏదైనా మ్యాటర్ కోర్టుకి వెళ్ళింది అంటే… అది జగన్ ప్రభుత్వానికి పెద్దగా కలిసి రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఉపసన లభించింది
టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతిలో అక్రమ భూ సేకరణ కార్యకలాపాలకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మలపతి శ్రీనివాస్పై ఆంధ్రప్రదేశ్ ఎసిబి విభాగం పలు కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించిమ దర్యాప్తు జరగాల్సి ఉంది,.అయితే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక గాగ్ ఉత్తర్వు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన సమాచారం మీడియాకు వెల్లడించవద్దని ఆదేశించింది. వైయస్ఆర్సిపి ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ తరువాతే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు,
చాలా కాలం తరువాత మొట్టమొదటిసారిగా లీగల్ బెంచ్ ప్రభుత్వం తరఫున తీర్పు ఇవ్వడం ఇదే కాబోలు. సుప్రీంకోర్టు వైయస్ఆర్సిపి ప్రభుత్వానికి, హెచ్ సి జారీ చేసిన గాగ్ ఉత్తర్వులపై స్టే ఆర్డర్ జారీ చేయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించింది. సుప్రీం కోర్టుని సంప్రదించినప్పుడు, వ్యత్యాసాలు జరిగాయని స్పష్టమైన ఆధారాలు ఉన్న చోట గాగ్ ఆర్డర్లు జారీ చేయడం హైకోర్టుకు ఎలా నైతికమని ఎపి ప్రభుత్వం ప్రశ్నించింది.
వాస్తవానికి, చాలా మంది న్యాయ నిపుణులు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు యొక్క తీర్పును అధికారికంగా విడుదల చేసినప్పుడు విమర్శించారు. కొంతమంది ఎపీ న్యాయవ్యవస్థను తప్పు మార్గంలో నడిపిస్తున్నారని కొందరు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తరువాత, వైయస్ఆర్సిపి సభ్యులు కోర్టు వారు టిడిపి ప్రభుత్వం చేసే చట్టవిరుద్ధ మార్గాలకు చెక్ పెట్టారని, మరియు అన్నీ వాస్తవాలు అతి త్వరలో బయటకు వస్తాయని అన్నారు.