ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. అమావాస్యకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్దశి అని కూడా అంటారు. నరక చతుర్దశి రోజున తెల్లవారు జామున మంగళ స్నానాలు చేసి హారతులు తీసుకుంటుంటారు. కానీ ఈ హారతులు తీసుకోవడం కూడా సరైన సమయంలో తీసుకోవడం వల్ల ఎంతో శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. నవంబర్ 14,2020 సంవత్సరం లో నరక చతుర్దశిని సూర్యోదయానికి ముందు అనగా 4 గంటల నుంచి 5: 55 నిమిషాల లోపుమంగళ స్నానాలు చేసి హారతులు తీసుకోవడానికి ఇది సరైన సమయం అని పండితులు సూచిస్తున్నారు.
దీపావళి పండుగ మనకు ధనత్రయోదశి నుంచి మొదలవుతుంది. చాలామంది ధనత్రయోదశి అంటే ఆ రోజు బంగారం కొంటే ఎంతో మంచిదని ఉన్న డబ్బులు మొత్తం బంగారం కొనడానికి ఖర్చు చేస్తుంటారు. నిజానికి ధన త్రయోదశి అంటే మన దగ్గర ఉన్న బంగారు నగలను అమ్మవారికి ధరించి పూజ చేయడం ద్వారా మంచి జరుగుతుందని అర్థం.అంతేకానీ ధన త్రయోదశి రోజున బంగారం కొనాలని ఏ శాస్త్రంలోనూ లేదు.
దీపావళి రోజున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి పూజలు అమావాస్య రోజు కేవలం అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు మాత్రమే పూజ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ సంవత్సరం 14 నవంబర్ 2020 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమావాస్య ఘడియలు ఉండటంవల్ల ధనలక్ష్మి పూజలు నిర్వహించుటకు పండితులు ఖరారు చేశారు. నవంబర్ 15వ తేదీన సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారీశ్వరస్వామి వ్రతం, జరుపుకొనేవారు ఆదివారం ఈ వ్రతాలు జరుపుకోవచ్చు. అంతేకాకుండా దీపావళి నోములు కూడా ఆదివారం జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.