Makara Jyothi: కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అయ్యప్ప దీక్ష ను 21 రోజులు, 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు భారీ ఎత్తున ప్రతిరోజు తరలి వెళ్తారు.. శబరిమల అంటే మొదటిగా గుర్తొచ్చేది మకరజ్యోతి.. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని చూసి ఎందుకు లక్షదిమంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి మకర జ్యోతిని దర్శించడానికి వస్తూ ఉంటారు.. ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తుల గట్టి నమ్మకం..
ధనుర్మాసంలో అయ్యప్ప దీక్ష చేసి ఆ తర్వాత సంక్రాంతి పండుగ రోజున అయ్యప్ప దర్శనం చేసుకుని ఆయప్ప దీక్ష నుండి విముక్తులవుతారు. ఇలా ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి శబరిమల కొండలపై కొలువై ఉన్న అయ్యప్పను దర్శించి ఆ తర్వాత అయ్యప్ప మాల తొలగిస్తారు. మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలపై మకర జ్యోతి వెలుగుతుందని.. దీనికి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. కానీ ఈ జ్యోతిలో ఎటువంటి నిజం లేదని కొంతమంది కొట్టి పారేస్తరు. మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలపై కనిపించే ఆ మకర జ్యోతిని దర్శించడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజలందరూ మకర సంక్రాంతి రోజున కనిపించే ఆ జ్యోతిని వీక్షించటానికి శబరిమల వెళ్తారు.
పురాణాల ప్రకారం… పూర్వం శబరిమల కొండలలో నివసిస్తున్న గిరిజనులను కాపాడటానికి అయ్యప్ప మహిషాన్ని చంపి కొండలపై ఒక పెద్ద జ్యోతిని వెలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. రాత్రిపూట వెలిగించి ఈ జ్యోతిని చూసిన తర్వాత పందాల వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు సమర్పించడానికి వస్తారు. ఎన్నో ఏళ్లుగా శబరిమల కొండలలో నివసించే గిరిజనులు మకర సంక్రాంతి రోజున పెద్ద జ్యోతి వెలిగించి పండగ జరుపుకుంటారు. ఈ జ్యోతి వెలిగిన తర్వాత వంశస్థులు అయ్యప్ప స్వామికి ఆభరణాలు సమర్పిస్తారు. దీన్నే అయ్యప్ప స్వామి జ్యోతిగా, మకర జ్యోతిగా పిలుస్తూ ఉంటారు.దీని వల్ల అప్పటినుంచి ఇప్పటివరకు జ్యోతి దర్శనం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.. ఈ దర్శనం చేసుకుంటే సకల బాధలు తొలగిపోతాయని ప్రతితి.