Brahmamudi సెప్టెంబర్ 22 ఎపిసోడ్ 207: నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ అనామిక అని కలవడానికి వెళ్తాడు. అనామిక కొంతసేపు కళ్యాణి ఆటపట్టించి చివరికి తనని ఇష్టపడుతున్నట్లు చెబుతుంది. కళ్యాణ్ ఆనందంతో అనామికను హద్దుకుంటాడు. అనామిక గోల లో పడి అప్పుకి ఇచ్చిన మాట మర్చిపోతాడు కళ్యాణ్.రాజ్ కావ్యను తీసుకు వెళ్లడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. రుద్రాణి రాహుల్ కి ఫోన్ చేసి అనుకున్న పని పూర్తవ్వాలి అని గుర్తు చేస్తుంది.
ఈరోజు 207 వ ఎపిసోడ్ లో,కావ్యబొమ్మల కి రంగులు వేస్తూ ఉంటుంది అదే టైం కి అక్కడికి రాజ్ వస్తాడు. మీరేంటండి ఈ టైం లో వచ్చారు అంటుంది కావ్య. లేట్ అయింది కదా అందుకని అని అంటాడు రాజ్. నేను తాత గారికి ఫోన్ చేసి చెప్పాను కదా అంటుంది కావ్య. అందుకే వచ్చాను అని అంటాడు. ఓహో తాతయ్య గారు చెప్పారని వచ్చారా అంటుంది. లేదు నేను తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటాడు. అది కూడా తాతయ్య గారు చెప్తేనే కదా వచ్చింది అని అంటుంది కావ్య. నాకు అనిపించే వచ్చాను అని అంటాడు. నేను మిమ్మల్ని నమ్మను అంటుంది కావ్య ఇప్పుడు నేను నిన్ను నమ్మించాలా అని అంటాడు ఏది నమ్మించండి చూద్దాం అని అంటుంది కావ్య అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు అల్లుడు గారితో అలా గొడవ పడుతున్నావు తింగరి దానీలా మాట్లాడమాకు అని అంటుంది. థాంక్స్ ఆంటీ కరెక్ట్ గా చెప్పారు అని అంటాడు రాజ్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు అని అంటాడు. లోపలికి రండి బాబు అని అంటాడు కృష్ణమూర్తి పర్లేదండి మీ అమ్మాయి పని అయిపోతే తీసుకొని వెళ్తాను అంటాడు రాజ్. అదేంటి బాబు ఇక్కడ దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా అంటుంది కనకం. పర్లేదండి ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు వెళ్తాను అని అంటాడు సరే మీరు వెళ్ళండి అయితే అంటుంది కావ్య అంటే నువ్వు రావట్లేదా అంటాడు రాజ్.
కావ్య వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్న రాజ్..
కావ్య నీ ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు రాజ్. నాకు రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా బొమ్మలకి రంగులు వేయలేదు. ఇంకొక కోటింగ్ వేస్తే అయిపోతుంది అని అంటుంది కావ్య. కృష్ణమూర్తి నువ్వు ఎల్లమ్మ మిగిలిన పని నేను చూసుకుంటాను అని అంటాడు. మొదటి కోటింగ్ నేనే వేసాను కదా నాన్న రెండో కోటింగ్ కూడా నేనే వేస్తాను అని అంటుంది కావ్య. వెంటనే రాజ్ అయితే నేను నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటాను అని అంటాడు. అప్పు అది అంత సులభం కాదు బావ అని అంటుంది. మీ అక్క ఉండగా లేనిది నేను ఎందుకు ఉండలేను అని అంటాడు రాజ్. మాకంటే చిన్నప్పటినుండి ఇక్కడే పెరిగింది కాబట్టి తన అలవాటు నీకు అలవాటు లేదు కదా కంపెనీ నడిపిన అంత సులభం కాదు మా ఇంట్లో ఈ మట్టి మధ్యలో ఉండటం. మీ అందరికీ కొంచెం ఎక్కువ అనుకుంటా అని అంటాడు రాజ్. ఏంటి బావ అది మమకారమా అంటుంది అప్పు. కాదు ఎటకారం అంటాడు రాజ్.సరే బాబు మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అంటుంది కనకమ్. కృష్ణమూర్తి నేను తార్కానా దాకా వెళ్లొస్తాను బాబు అని అంటాడు ఈ టైంలో ఎందుకండీ అని అంటాడు రాజ్. మేము తయారు చేసిన విగ్రహాలన్నీ అక్కడే ఉన్నాయి కదా బాబు ఒక విగ్రహం పగిలిపోయిన చాలా నష్టం వస్తుంది అందుకే రోజు వాటికి కాపలా పడుకుంటున్నాను అని వెళ్తాడు. రాజ్ కావ్యతోపాటు కూర్చొని మీ నాన్న చాలా మంచివాడు కదా నెమ్మదస్తుడు థాంక్స్ అంటుంది కావ్య అవును ఆయన పోలిక నీకు ఒక్కటి కూడా రాలేదు అని అంటాడు రాజ్.
Nuvvu Nenu Prema: కృష్ణాష్టమి పూజ అంతరాయం.? విక్కీని కాపాడిన పద్మావతి.. కృష్ణ ప్లాన్ రివర్స్?
విగ్రహాల దొంగతనం..కి ఏర్పాటు
రాహుల్ పంపించిన రౌడీలు కృష్ణమూర్తి చేసిన బొమ్మల దగ్గరికి వచ్చి అన్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంకి అక్కడికి కృష్ణమూర్తి వస్తాడు. రౌడీలో ఒకడు ఏంటి ముసలోడు ఇంట్లో ఉన్నాడు అని చెప్పావు కదా ఇక్కడే ఉన్నాడు అని అంటాడు ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాడన్న ఇప్పుడే వచ్చినట్టున్నాడు అని అంటాడు రౌడీ. సరే కాసేపు వెయిట్ చేద్దాం ఆయన వెళ్ళిపోయాక విగ్రహారాన్ని దొంగతనం చేద్దాం అని అనుకుంటారు. కృష్ణమూర్తి అన్ని విగ్రహాల్ని చూసుకుంటూ చాలా ఆనంద పడుతూ ఉంటాడు. ఏంటి ముసలోడు విగ్రహాలను చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు అని అనుకుంటారు రౌడీలు.
రాజ్ కి థాంక్స్ చెప్పిన కావ్య..
రాజ్ కాఫీ తాగుతూ కావ్య, ని చూసి, తను చేస్తున్న పనిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి అలానే చూస్తున్నారు అని అంటుంది కావ్య ఏం చూడకూడదా అని అంటాడు రాజ్. మీ అమ్మగారు మిమ్మల్ని కడుపుతో ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఏమన్నా తినేశారా అని అంటుంది. నేను ఏది అడిగినా ప్రశ్నలే వేస్తారు అని అంటుంది. నువ్వు కలర్స్ బాగా వేసావని చూస్తున్నానులే అని అంటాడు రాజ్. ఈసారి నుంచి బాగా వేస్తాను లేండి అని అంటుంది. అరే నేను నువ్వు బాగా వేసావని అంటున్నాను అంటాడు రాజ్. అవునా ఎప్పుడు తిడుతూ ఒకసారి పొగిడేటప్పటికీ నాకు అర్థం కాలేదు లేండి అని అంటుంది కావ్య. నేను ఇప్పుడు చాలా వాడికి తగ్గించాను అని అంటాడు. ఏంటి తిట్టడమా అంతకుముందు గంటకి 10 సార్లు తిట్టేవాళ్ళు ఇప్పుడు గంటకు ఒకసారి తిడుతున్నారు అని అంటుంది కావ్య చాల్లే పని చూసుకో అంటాడు రాజ్.నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి అని అంటుంది కావ్య ఏంటో చెప్పు వద్దన్నా ఆగవు కదా అంటాడు రాజ్. ఈ కాంట్రాక్టు వచ్చింది మీ వల్లే కదా అందుకని మీరు ఈరోజు రాత్రికి ఇక్కడే ఉంటే, మీతో కొబ్బరికాయ కొట్టించి రేపు ఉదయం ఇవన్నీ అమ్మేస్తాము అని అంటుంది. అప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండి ఒప్పుకోండి అని అంటుంది. రాజ్ మనసులో మనం హీరో అయిపోవచ్చు అన్నమాట అని అనుకొని సరేలే అని అంటాడు. కావ్య చాలా హ్యాపీగా థాంక్స్ థాంక్స్ అండి అని చెప్తుంది. నీకోసమే ఒప్పుకోలేదు మీ అమ్మ వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు అన్నావు కదా అందుకని ఒప్పుకున్నాను అంటాడు రాజ్. సరే మహానుభావా మీరు నా మీద ప్రేమతో ఒప్పుకోలేదు మా అమ్మ వాళ్ళ కోసమే ఒప్పుకున్నారు అదే అనుకుంటాను అని అంటుంది అనుకోవడం కాదు అదే నిజం కూడా అంటాడు రాజ్.
మామగారిని రిక్వెస్ట్ చేసిన ఆపర్ణ..
అపర్ణ దేవి హాల్లో తిరుగుతూ ఉంటుంది అదే టైంకి సీతారామయ్య చూసి ఏంటమ్మా ఇంకా నిద్ర పోలేదా అని అంటాడు. ఎలా నిద్ర పడుతుంది మామయ్య టైం చూశారా ఎంత అయిందో, మీ మనవరాలు మిమ్మల్ని పర్మిషన్ అడిగి పుట్టింటికి వెళ్ళింది. కానీ ఈ టైం దాకా ఇంటికి రాకపోయేసరికి, తన గురించి ఆలోచిస్తున్నాను అసలు తనకి కొంచమైనా బాధ్యత ఉందా అని అంటుంది. ఆలస్యమవుతుందని నాకు ఫోన్ చేసి చెప్పిందమ్మా అని అంటాడు సీతారామయ్య. మావయ్య గారు మీరు ఏమీ అనుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను. ఏంటో చెప్పమ్మా అంటాడు సీతారామయ్య. మీరు కావ్యని ప్రతిదానికి, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులకే కావ్య అత్తగారింటికి వచ్చాను అన్న విషయం కూడా మర్చిపోతుంది. ఇప్పుడు తన కుటుంబం అంటే పుట్టినిల్లు కాదు ఈ ఇల్లు అనిఈ ఇంటి పరువు మర్యాదలు ఆలోచించాలి అని ఎలా తెలుసుకుంటుంది అని అంటుంది. అయితే నన్ను ఏం చేయమంటావ్ అమ్మ అని అంటాడు సీతారామయ్య. మీరు ఇప్పుడు దాకా తనకి సపోర్ట్ చేశారు. ఆ కాంట్రాక్ట్ కోసం హెల్ప్చేస్తానంటే ఒప్పుకున్నారు.మంచో చెడుఆ కాంట్రాక్టు పూర్తయిన తర్వాత మళ్లీ పుట్టింటి విషయాలు జోక్యం చేసుకోవద్దు అని చెప్పండి.కన్నవారిని మర్చిపోమని చెప్పమంటావా అని అంటాడు. పండుకో పబ్బానికో వెళ్లి రమ్మనండి. ఇలా ప్రతిరోజు వెళ్లడం వద్దు అని చెప్తున్నాను అంటుంది ముందు ఈ కాంట్రాక్ట్ పూర్తవనివ్వమ్మా అప్పుడు చూద్దాం అని అంటాడు సీతారామయ్య చూద్దాం మామయ్య గారు మీరు కచ్చితంగా తన విషయంలో ఇంకా జోక్యం చేసుకోకండి అని అంటుంది. అదే టైంకి రుద్రాణి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది.
కొడుకు మీద అపర్ణ కోపం..
మీరే ఆలోచించండి మావయ్య గారు ఇంత టైం అయింది ఇప్పుడు తను ఒంటరిగా ఇక్కడికి రావాలి. అందుకే చెప్తున్నాను తనని మీరు సపోర్ట్ చేయడం ఆపేయండి అని అంటుంది. నువ్వేం కంగారు పడకు అపర్ణ, కావ్యను తీసుకురావడానికి రాజ్ వెళ్ళాడు అని అంటాడు. అపర్ణకి చాలా కోపం వస్తుంది. రాజ్ ఎందుకు వెళ్లాడు అని అంటుంది. నువ్వే అన్నావ్ కదా అపర్ణ చీకటి పడిందని ఇంత రాత్రి ఒక్కతే ఎలా వస్తుంది అందుకే నేనే తీసుకు రమ్మన్నాను అంటాడు సీతారామయ్య.అయినా నేను తీసుకొని రమ్మన్నాను ఇంత లేట్ ఎందుకు అయిందో నాకు తెలియదు ఒకసారి ఫోన్ చేస్తాను అని అపర్ణ ముందే రాజ్ కి ఫోన్ చేస్తాడు సీతారామయ్య. ఇదంతా దూరం నుండి రుద్రాణి వింటూ ఉంటుంది. సీతారామయ్య స్పీకర్ ఆన్ చేసి రాజ్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి తాతయ్య చెప్పండి అని అంటాడు. మీ అమ్మ కంగారుపడుతుంది అని అంటాడుసీతారామయ్య.నేనే ఫోన్ చేద్దామనుకున్నాను తాతయ్య ఈరోజు రావడం కుదరదు ఇక్కడే ఉంటున్నాను అని అంటాడు దానికి అపర్ణ ఒకసారిగా షాక్ అవుతుంది. ఎందుకు అని అంటాడు సీతారామయ్య. రేపటితో వీళ్ళ కాంట్రాక్ట్ పూర్తి అవుతుంది నా చేతులతో కొబ్బరికాయ కొట్టాలని వీళ్లు అనుకుంటున్నారు అందుకే ఉంటున్నాను అంటాడు రాజ్. మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటాడు సీతారామయ్య అమ్మ కూడా చెప్పేయండి అని అంటాడు రాజ్. విన్నావు కదమ్మా ఇప్పుడు వెళ్లి ప్రశాంతంగా పడుకో అని అంటాడు సీతారామయ్య సరే అంటుంది అపర్ణ కానీ అపర్ణ చాలా కోపంగా మనసులో, రాజా అక్కడికిరాజ్ అక్కడికి వెళ్లదు అంటే వినడు, వాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత ఏదో ఒక మాయమాటలు చెప్పి తనని లొంగ తీసుకోవాలని చూస్తారు ఈ విషయం చెప్పిన వాడికి అర్థం కాదు చా అనుకొని అపర్ణ విసుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న రుద్రాణి వెంటనే రాహుల్ కి ఫోన్ చేసి రాజ్ అక్కడే ఉన్నాడు నువ్వు జాగ్రత్త మనం అనుకున్న పని అవ్వాల్సిందే అని అంటుంది.నువ్వేం కంగారు పడకు మమ్మీ రౌడీల్ ఆల్ రెడీ అక్కడికి వెళ్లారు తెల్లవారిటప్పటికి నీకు ఒక మంచి శుభవార్త చెప్తాను అంటాడు రాహుల్. ఏది ఏమైనా విగ్రహాలు మాత్రం కావేరి దొరక్కకూడదు అంటుంది రుద్రాణి కచ్చితంగా అదే జరుగుతుంది మమ్మీ ను కూల్ గా పడుకో అంటాడు.
కుటుంబంతో సంతోషంగా గడిపిన కావ్య.
కావ్య పనులన్నీ పూర్తి చేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. వాళ్ళ అమ్మ బాధపడుతుంది చూసి, ఎందుకమ్మా బాధపడుతున్నావు ఇప్పుడు ఏ కష్టం లేదు కదా అని అంటుంది. కష్టం వస్తేనే కన్నీళ్లు వస్తాయి అని అనుకోవడం, బాధపడితేనే ఏడుస్తాము అని అనుకుంటావు అందరూ, అంటే ఇప్పుడు నువ్వు బాధతో కాదన్నమాట, సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటుంది కావ్య. రేపటితో మన సమస్యలన్నీ తీరిపోతాయి అని చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు ఇంట్లో అందరూ,మీ ఆయనమనకి ఈ కాంట్రాక్ట్ ఇప్పించి ఉండకపోతే మనకి సమస్యలు తొలిగేవి కాదు ఎందైనా మీ ఆయన దేవుడు అని ఇంట్లో అందరూ రాజ్ ని పొగుడుతూ ఉంటారు. దూరం నుంచి రాజ్ వీళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు. ఏదేమైనా మీ ఆయన నిన్ను ఇక్కడికి పంపించి ఉండకపోతే ఇన్ని బొమ్మలు అనుకున్న టైం కి పూర్తయ్యేవికావు, మీ ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిది మీ ఆయన దేవుడు అని అంటుంది కనుకమ్.అప్పుడే అక్కడికి వచ్చినప్పుడు అక్క ఏంటి అందరూ ఇక్కడ కూర్చున్నారు అని అంటుంది. ఎవరికి నిద్ర రావట్లేదా అంటుంది అప్పు. నువ్వు ఎందుకు నిద్ర పోలేదు మేము అందుకే పోలేదు అని అంటారు. నాకంటే ఆకలేసి మెలకువ వచ్చింది. అయినా అందరం కలిసి ఉన్నాం కదా ఇప్పుడు మనం ఆటాడుకుందాం అని అంటుంది. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కనకం కావ్యతో, మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలా గడిచిపోయాయో రోజులు అసలు తెలియనే తెలీదు అని అంటుంది. ఆ రోజులన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా వస్తే బాగుండమ్మా అని అంటుంది అది ఎలా కుదురుతుంది అక్క పెళ్లయిన తర్వాత ఆడపిల్ల అక్కడికి వెళ్లిపోవాలి. అత్తారింటికి వెళ్లి పోవాలి అదే కదా రూలు సామెత కూడా ఉంది కదా ఆడపిల్ల ఆడపిల్ల అని, ఇక్కడి పిల్ల కాదు అని. ఇది చాలా అన్యాయం అమ్మ పెళ్లయి పాతికేళ్ళు కనిపించిన అమ్మానాన్నలని తోడబుట్టిన వాళ్ళని వదిలేసి ఆడవాళ్లే ఎందుకు వెళ్ళాలి అమ్మ అత్తగారింటికి, ఏం అబ్బాయిలు కూడా ఆ పని చేయొచ్చు కదా అని అంటుంది కావ్య. అప్పట్లో మగవాడు అంటే వంశోద్ధారకుడు అని ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అని భరించలేని భారం అని అనుకోవడం వల్లే అలాంటి ఆచారాలన్నీ పెట్టారేమో అమ్మ అంటుంది కనకం. నేనైతే నా మొగుడిని నా దగ్గరికి తెచ్చుకుంటానుఅని అంటుంది అప్పు.ఇల్లరికమా అంటుంది వద్దే తల్లికావ్య లాంటి ఆడపిల్లని తట్టుకోగలంగానే నీలాంటి ఆడపిల్లల్ని భరించలేం అంటుంది కనుకమ్.అందరూ కలిసి సంతోషంగా పాటలు పెట్టుకొని గడుపుతూ ఉంటారు డాన్స్ వేస్తూఎంజాయ్ చేస్తూ ఉంటారు అదంతా రాజు చూసి సంతోషిస్తూ ఉంటాడు.
రేపటి ఎపిసోడ్ లో రాహుల్ అనుకున్నట్టుగానే రౌడీల్ని పంపించి విగ్రహాన్ని దొంగతనం చేయిస్తాడు. రౌడీలు కృష్ణమూర్తిని బాగా కొడతారు కృష్ణమూర్తికి రక్తంతో పడి ఉంటాడు అప్పుడే కావ్య ఇంట్లో అందరూ అక్కడికి వచ్చి కృష్ణమూర్తి చూసి ఏమైంది నాన్న అని అడుగుతారు. కృష్ణమూర్తి ఏడుస్తూ మన విగ్రహాలన్నీ దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లారు అమ్మ అని బాధపడతాడు. కావ్య వాళ్ళ నాన్నని ఓదారుస్తూ ఉంటుంది అదంతా రాజు చూస్తూ ఉంటాడు