Krishna Mukunda Murari February 3 2024 Episode 384: భవానీ దేవి ఆదర్శ ముకుంద లకు ఇద్దరికీ శోభనంకు ముహూర్తం ఇప్పుడు కాదు తర్వాత పెట్టిస్తాను మంచి ముహూర్తం అప్పుడే వాళ్లకు జరగాలి అని అంటుంది భవానీ దేవి చెప్పిన నిర్ణయానికి రేవతి ఇప్పుడు పెట్టుడు ముహూర్తం ఉంది అక్క అని అంటుంది ఆ ముహూర్తం లో కావాలంటే కృష్ణ మురారిలకు చేయించుకుని ముకుందా ఆదర్శులకు మాత్రం ఇప్పుడు వద్దు మంచి ముహూర్తం చూసే పెట్టించాలి అని అంటుంది. ఆ మాటలకు కృష్ణ నచ్చ చెప్పాలని అది కాదు పెద్ద అత్తయ్య అని చెప్పబోతుంటే ఇప్పుడు మాటలన్నీ అనవసరం మీకు కావాలంటే మీరు చేసుకోండి కానీ ఆదర్శముకుందులు మాత్రం కొన్ని రోజులు ఆగుతారు అని అంటుంది. ఇక ఏం చెప్పలేక అయితే మేము కూడా అప్పటిదాకా పెట్టడం ముహూర్తంలో శోభనానికి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్లతో పాటు మాకు కూడా ముహూర్తం పెట్టండి అని కృష్ణ వాళ్ళతో చెప్పి రూమ్ కి వస్తుంది.
ఇక రూమ్ కి వచ్చిన కృష్ణ మురారి దగ్గర ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మురారి నువ్వు పెద్దత్తయ్య దగ్గర ఏం చెప్పొచ్చావు మనం పెట్టుడు ముహూర్తానికి ఓకే అని చెప్పావు కదా అని అంటాడు అందుకు కృష్ణ అదికాదు ఏసీబీ సార్ వాళ్లు కోసమే కదా మనం ఇన్నాళ్లు ఆగింది ఇప్పుడు మనం తొందరపడి ముహూర్తం పెట్టించుకుంటే ఏం బాగుంటుంది అని అంటుంది. దానికి ఇప్పుడు నువ్వేం చెప్పావు అది చెప్పు అని అంటాడు. కృష్ణ భయపడుతూ మీరు నన్ను ఏమీ అనరంటే చెప్తాను అని అంటుంది. నేనేమీ అనను కృష్ణ చెప్పు అని అంటాడు. అయితే ముకుంద వాళ్ళతో పాటే మాకు కూడా ముహూర్తం పెట్టండి మాకు పెట్టుడు ముహూర్తం ఏమి అవసరం లేదు అని చెప్పాను అంటుంది వెంటనే మురారి నిన్ను కర్ర తీసుకొని కొట్టాలి అసలు అని అంటాడు అందుకుకృష్ణ బయటికి వెళ్లబోతూ ఉండగా ఆగు అని అంటాడు దగ్గరికి రా అని పిలుస్తాడు ఏంటి ఏసిపి సార్ నన్ను కొడతారని అంటుంది కొట్టండి కృష్ణారావు అని అంటాడు ఇప్పుడు దీనికి సొల్యూషన్ కూడా ఏదో ఒకటి ఆలోచించాలి కదా కృష్ణ అని అంటాడు మురారి సార్ బాగా చెప్పారు ముందు మీరు కూర్చోండి ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అని అంటుంది ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు.
ఇక కృష్ణ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏసీబీ సార్ భవానీ దేవి అత్తయ్యకు ముకుంద మీద నమ్మకం కుదరట్లేదు ఇప్పుడు మనం ముందు భవానీ దేవికి, అత్తయ్యకు ముకుందా ఆదర్శ ఇద్దరు కలిసిపోయారు వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలియాలి ముకుంద మారినట్టు మనం ఆవిడ దగ్గర నిరూపిస్తే ఆవిడ తొందరగా ముహూర్తం పెట్టిస్తారు అని అంటుంది. అందుకు మురారి కూడా ఓకే అంటాడు అయితే ఇప్పుడు మనం ఏం చేసి వాళ్ళిద్దరిని కలపాలి అనిఅంట అంటాడు వెంటనే నేను చెప్పినట్లు చెయ్ కృష్ణ అనే రేపు ఉదయం మనందరం కలిసి బెస్ట్ కపుల్ అవార్డుకి మనిద్దరి పేర్లతో పాటు వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నలుగురం కలిసి వెళ్దాము అక్కడ వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం భవాని దేవి అత్తయ్య చూసి వాళ్లకి కూడా కలిసిపోయారు అని అనుకుంటుంది అని అంటాడు మురారి అందుకు కృష్ణ కూడా సరే అంటుంది.అయితే వాళ్ళని ఒప్పించాలి కదా అని అంటుంది అందుకు కూడా నా దగ్గర ప్లాన్ ఉంది అని కృష్ణ అంటుంది. ఇక అందరూ కలిసి కిందకు వెళ్తారు.
ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కృష్ణ మురారి ఇద్దరు వస్తారు. ఇక వాళ్ళని చూసి అందరూ వడ్డిస్తూ ఉంటారు కృష్ణ చేసిన భోజనం ఎలా ఉంది అని అడుగుతుంది అది తిని అందరు ఇందులో ఉప్పు లేదు కదా అని అంటారు వెంటనే కృష్ణ ఎందుకు ఇవాళ ఇలా భోజనం వండేవు అని అడుగుతుంది భవాని దేవి అందుకు కృష్ణ నందు వైపు చూస్తుంది మేమందరం అడుగుతుంటే నందువైపు చూస్తావ్ ఏంటి అని అంటే నేనే అన్నయ్య అన్నం వండింది అని చెప్తుంది నందు నువ్వు ఆ అయితే ఈ విషయం ముందే చెప్తే మీ హోటల్ కి వెళ్ళేవాళ్లం కదా అంటాడు మధు.ఇక అందరూ కలిసినందుని ఆటపట్టిస్తూ ఉంటారు ఇప్పుడు నేను మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అని మురారి రేపు ఉదయం మా ఫ్రెండు బెస్ట్ కపుల్ అవార్డ్స్ ఇస్తున్నాడు దాంట్లో కాంపిటీషన్లో నా పేర్లతో పాటు ఆదర్శ ముకుంద పేర్లు కూడా ఇచ్చాను అని అంటాడు దానికి ముకుంద షాక్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేసి తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది మేమిద్దరం కలిసి వెళ్లడం అంటే నాకు అసలు ఇష్టం లేదు అని అంటుంది.కానీ పైకి చెప్పలేక సతమతమవుతూ ఉంటుంది ఇక మంచి పని చేశావు నలుగురు కలిసి వెళ్ళండి అని అంటుంది భవాని దేవి అందుకు ముకుందా నేను రాను అని అంటుంది.
కారణమేంటో చెప్పాలి కదా అని అంటుంది భవానీ దేవి. కారణం అంటూ ఏమీ లేదు అత్తయ్య అక్కడికి వెళ్లిన తర్వాత ఆదర్శ్ ని ఎవరైనా అంటారేమోనని భయంగా ఉంది అని ఆదర్శం మీదకి తోసేస్తుంది వెంటనే భవానీ దేవి ఆదర్శం ఏమంటారు అని అంటుంది ఆదర్శకున్ని ఏమీ అనకపోయినా మేమిద్దరం కలిసి క్లోజ్ గా ఉండడం లేదు కాబట్టి అది గుర్తించి ఎవరైనా మీరు ఇన్నాళ్లు క్లోజ్ గా ఉండలేదా అని అడిగితే దానికి గతం మొత్తం చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఆదర్శ్ ఫీలవుతాడు అని ముకుందా ఆదర్శం మీదకు తోసేస్తుంది.దానికి మురారి క్లారిటీ ఇస్తాడు ఆ క్లోజ్ గా ఉంటేనే భార్యాభర్తలు కాదు అలా అనుకుంటే 99 మంది క్లోజ్ గానే ఉంటారు లోపల అట్లాగానే అందరికీ బెస్ట్ కపుల్ అవార్డు వస్తుందా రాదు కదా అని అంటాడు నువ్వు అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకు రేపు ఉదయం మనం వెళ్తున్నాము అని చెప్తాడు మురారి ఇక కృష్ణ తొందరగా అన్నం తినేసి మనం బయటికి వెళ్దాం అంటాడు ఎక్కడికి అని భవాని దేవి అడుగుతుంది దానికి మురారి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ అమెరికా వెళ్తుంది తనకి జెండా ఇవ్వడానికి వెళ్తున్నాం అని అంటాడు వెంటనే అందుతాయి ముకుంద ఆదర్శం కూడా తీసుకెళ్లండి సరదాగా మీతో పాటు వాళ్ళు బయటికి వస్తారు అంటుంది. వెంటనే ముకుంద దానికి కూడా ఒప్పుకోదు ఇక భవాని దేవికి అసలే ముకుంద మీద అనుమానంగా ఉంటే ముకుంద చేసే ప్రతి పని భవాని దేవికి అనుమానం ఎక్కువ చేస్తుంది. దేనికి మనిద్దరం వెళ్తే ఏమైంది అని ఆదర్శ్ కూడా అంటాడు కానీ ముకుంద మాత్రం వాళ్లతో కలిసి వెళ్లడం ఇష్టం లేక ఇలా చెప్పానని అనుకుంటున్నారు కదా కానీ నేను వాళ్ళతో కలిసి వెళ్లడానికి ఇష్టం లేక ఇలా చెప్పలేదు నాకు డస్ట్ ఎలర్జీ ఉంది ఆ విషయం కింద అందరిలో చెప్పలేను కదా అని ఆదర్శ్ దగ్గర కావాలని నటిస్తూ ఉంటుంది. మీతో కలిసి ఇష్టం లేక అలా చెప్పాను అని మనసులో అనుకుంటుంది. ఆదర్శం ముకుందని నమ్ముతాడు. సరే ముకుందానే నిన్ను అర్థం చేసుకున్నాను అని అంటాడు మీరు అర్థం చేసుకున్నారు కానీ ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను మారానంటే ఎవరు నమ్మట్లేదు అని అంటుంది నువ్వు మారావని నేను నమ్ముతున్నాను ముకుందా అని ఆదర్శ అంటాడు.
ఇక కృష్ణ మురారి ఇద్దరూ సరదాగా బయటికి వెళ్తారు కొంత దూరం వెళ్లేసరికి కృష్ణ ఎందుకు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతాడు మురారి వెంటనే కృష్ణ ఏమి లేదు ఏసిపి సార్ అని నేను బయటికి వచ్చినా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏసిపి సార్ మూడు పాడు చేస్తున్నట్టున్నాను తనతో సరదాగా గడపాలి అని అనుకుంటుంది అప్పుడే సడన్ బ్రేక్ వేస్తాడు ఎదురుగా ఒక బాబు అడ్డుపడతాడు ఆ బాబుని తరుముకుంటూ ఇద్దరు వ్యక్తులు వస్తారు దొంగతనం చేసి పారిపోతున్నాడని కొట్టబోతే కృష్ణ బాబుని కాపాడుతుంది.
రేపటి ఎపిసోడ్లో కృష్ణ మనకి ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఒకసారి గుడికి వెళ్లి వద్దామని అనుకుంటుంది. గుడికి వెళ్ళిన కృష్ణ పంతులుగారు చెప్పినట్టు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే ఆ దీపం కృష్ణ దండం పెట్టుకునే లోపు కొండెక్కుతుంది. దీపం మారిపోవడం అప్పచెపినంగా భావించి బాధపడుతూ ఉంటుంది కృష్ణ.