Krishna Mukunda Murari: ప్రసాద్, సుమతి ఇద్దరు కూర్చుని నలుగుకి కావాల్సిన లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఏం రాస్తున్నారు బాబాయిని మురారి అడగగా నీ నలుగుకి కావాల్సిన సరుకుల లిస్టు రాస్తున్నాను అని ప్రసాద్ చెబుతాడు. ఇక కృష్ణ కోపంగా చూసేసరికి అది కాదమ్మా కృష్ణ కూర్చో వదిన చెప్పింది కదా చేయాలి. తప్పదు నన్ను అర్థం చేసుకో అమ్మ అని అంటాడు. అయితే గంధం ఇంకాస్త ఎక్కువ రాయండి మావయ్య అని కృష్ణ అంటుంది. ఆ మాటకి సుమతి ప్రసాద్ మురారి ముగ్గురు షాక్ అయ్యి కృష్ణ వైపు చూస్తారు. ఎలాగో ఈ పెళ్లి జరగదని నాకు తెలుసు చిన్న మావయ్య మీరు గంధం ఇంకాస్త ఎక్కువ రాయండి అని కృష్ణ అంటుంది. నాకు గంధం అంటే చాలా ఇష్టం ఎలాగో ఈ పెళ్లి జరగదు కాబట్టి ఆ తర్వాత నాకు ఏ సి పి సార్కే పెళ్లి జరుగుతుంది అప్పుడు నేను గంధం ఇంకాస్త ఎక్కువ రాసుకుంటాను అని కృష్ణ అంటుంది. ఈ మాటలను కూడా భవాని దూరంగా నిలబడి వింటుంది. కృష్ణలో ఉన్న కాన్ఫిడెన్స్ ని భవాని గమనిస్తూ ఉంటుంది. అవును బాబాయ్ ఈ కేసులో పెద్దపల్లి ప్రభాకర్ తప్పు చేయలేదని తెలిసింది కచ్చితంగా ఈ కేసు వెనుక ఉన్న అసలైన వ్యక్తి ఎవరున్నారో అతన్ని కచ్చితంగా పట్టుకొని తీరుతాను అని మురారి అంటాడు.
Krishna Mukunda Murari Today Episode 359: భయం అన్న మాటే తన దరిదాపుల్లోకి రానివ్వడం లేదు కృష్ణ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది
కృష్ణ మురారి మాటలు విన్న తర్వాత భవాని ఆలోచనలో పడుతుంది ఒంటరిగా తన గదిలో కూర్చుని కృష్ణ ఈ కేసు విషయంలో అస్సలు భయపడటం లేదు భయం అన్న మాటే తన దరిదాపుల్లోకి రానివ్వడం లేదు కృష్ణ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. పెళ్లి జరుగుతుందన్న ఆలోచన కూడా తనకి లేదు పైగా తనలో కాన్ఫిడెన్స్ మాత్రమే కనిపిస్తుంది నేనేమైనా తప్పు చేస్తున్నానా అని భవాని ఆలోచిస్తుంది తన అంతరాత్మ చెప్పిన మాటల్లో మరోసారి భవాని గుర్తు చేసుకుంటుంది అయినా నేను తప్పు చేయను చెయ్యను గాక చేయను అయినా నేను ఎందుకు కృష్ణ గురించి ఆలోచిస్తున్నాను అని భవాని అనుకుంటుంది కాసేపటి తర్వాత భవాని గదికి శకుంతల వస్తుంది వదిన నేను మీతో మాట్లాడాలి దయచేసి మీ కాళ్లు పట్టుకుంటాను నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అని శకుంతల అడుగుతుంది భవాని రెండు చేతులు జోడించి దండం పెట్టి నాకు నీ మాటలు వినాలని లేదు ఒకవేళ వింటే నేను ఏమని సమాధానం ఇస్తాను కూడా నీకు తెలుసు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది మీరు నాకు దండం పెట్టడం ఏంటి వదిన. నేనే వెళ్ళిపోతాను అని శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణ దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తుంది. ఆ ఉంగరం ఆర్టిస్ట్ ని చంపిన అతని ఉంగరం అని కృష్ణ గుర్తు పడుతుంది. కానీ, ఆ ఉంగరం ఇది కాదేమో లే అని అనుకుని ఆ ఉంగరం వైపు కృష్ణ చూస్తూ ఉంటుంది దేవ్ అన్నయ్య కచ్చితంగా ఇలాంటి తప్పు చేసి ఉండడు అని కృష్ణ అనుకుని ఆ ఉంగరం వైపే చూస్తూ ఉంటుంది కృష్ణ ఏంటి ఆలోచిస్తున్నావు భోజనం చేయి అని మురారి అంటాడు ఇక అప్పుడే దేవ్ ఆంటీ నాకు ఆ పప్పు వేయండి అని తన వేలుని చూపిస్తాడు మరోసారి కృష్ణ ఆ ఉంగరం వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే భవాని ఊహించని బాంబు పేలుస్తుంది. రేపు ముకుంద మురారి లకు నలుగు పెడుతున్నాం అని అనౌన్స్ చేస్తుంది. అప్పుడు దేవ్ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందో అని నాకు అన్నం కూడా సహించడం లేదని తినకుండా ఉంటాడు. అప్పుడు దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని కృష్ణ చూస్తుంది. కానీ, కృష్ణ ఆ మాట మురారి కి చెప్పదు. ఏంటిది కృష్ణ నీ చెల్లిన ఆహా ఈ మాటతో నా సమస్యకు పరిష్కారాన్ని చూపించావు అని భవాని అంటుంది అయితే రేపు నీ చెల్లెలు కృష్ణ ఇంటిలో అదే అవుట్ హౌస్ లో నీ చెల్లెలి ముకుందా నలుగు ఫంక్షన్ జరుగుతుంది అందుకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చూడండి అని చెబుతుంది ఆ మాట వినగానే కృష్ణ లేచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మురారి కూడా వెళ్ళిపోతాడు. ఇక మురారి దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని గుర్తిస్తే పెళ్లి జరుగుతుందా లేదా అనేది చూడాలి.
కృష్ణ ఒంటరిగా కూర్చుని మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా భవాని అత్తయ్య ఈ నిర్ణయం తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎంత ఓపికగా ఉన్నా తను మాత్రం నా సహనాన్ని పరీక్షిస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే మురారి కృష్ణ కృష్ణ అని అరుస్తూ వస్తాడు. ఏమైంది ఏసిపి సార్ అని అడుగగా.. బాగా తలనొప్పిగా ఉంది అంటే.. నేను తల పడతాను అని కృష్ణ అంటుంది. అవునా ఎవరితో తలపడతావు అంటే.. అలా కాదు ఏసిపి సార్ అని కృష్ణ మురారి కి దగ్గరగా వెళ్ళి తన తల మీద తన ముని వేళ్ళతో సుతారంగా నొక్కుతుంది. అప్పుడు అక్కడ కాదు అని నుదుటి మీద నొక్కమని మురారి కృష్ణ చేతిని జరుపుతాడు. ఇలా నీచేత రోజు తల పట్టించుకోవడం కోసమైనా ఈ కేస్ త్వరగా తేల్చాలి అని అంటాడు. అంటే ఇందుకోసమేనా అని అడుగగా, అవును అని మురారి అంటాడు. కృష్ణ కోపంగా మురారి వైపు చూస్తుంది.
అప్పుడు మురారి కృష్ణ నీ దగ్గరకు రమ్మని పిలిచి ఏదో చెవిలో చెబుతడు. కృష్ణ ఆ మాటలకు సిగ్గు పడుతుంది. ఇలా మనం ఈ కేసు తేలకా ఒక నెలరోజులు పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్దాం అన్నా కదా అప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతాను అని కృష్ణ అంటుంది. అప్పుడే శకుంతల అక్కడికి వస్తుంది. మా ఇంటికి వెళ్లి వస్తున్నారా అత్తయ్య అని మురారి అడుగుతాడు. అవును అని అనగానే.. మా పెదమ్మ మిమ్మల్ని ఏమైనా అన్నారా అని మురారి అంటాడు. లేదు అని శకుంతల అక్కడ జరిగిన సన్నివేశాలను వివరిస్తుంది. భవాని రెండు చేతులు జోడించి దండం పెట్టి నాకు నీ మాటలు వినాలని లేదు ఒకవేళ వింటే నేను ఏమని సమాధానం ఇస్తాను కూడా నీకు తెలుసు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. మీరు నాకు దండం పెట్టడం ఏంటి వదిన. నేనే వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వచ్చసా అని శకుంతల అంటుంది. అత్తయ్య చాలా ఓపికగా నీకు సమాధానం చెప్పారు అని కృష్ణ అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో మురారి ముకుంద కి నలుగు ఫంక్షన్ చేస్తారు. ముకుంద కి ఎవరైనా నలుగు పెట్టమని భవాని అంటే.. మీ చేతులతో నాకు నలుగు పెట్టమని భవాని నీ రిక్వెస్ట్ చేస్తుంది ముకుంద. భవాని ముకుంద కి నలుగు పెట్టాక కృష్ణ నీ భవాని నలుగు పెట్టమని చెబుతుంది. అప్పుడే మురారి అక్కడికి వచ్చి ఈ కేసు లో ఒక దోషి దొరికాడు అని మురారి చెబుతాడు.