Nindu Noorella Saavasam December 05th 2023 Episode 98: అంజు ఇలా ఏడుస్తూ కూర్చొని అన్నం తినకుండా ఉంటే శక్తి ఎలా వస్తుంది ఎగ్జామ్ ఎలా రాస్తావు అని భాగమతి అంటుంది. చూడు మిస్సమ్మ నాకు అసలు ఏమీ తినబుద్ధి కావట్లేదు అని అంజు అంటుంది. అమ్మ ముద్ద కూడా వద్దా అని భాగమతి అంటుంది. వెంటనే అంజు తన నోట్లో అన్నం పెట్టుకొని తినేస్తుంది. అమ్మ ముద్ద అంటే వెనక ముందు ఆలోచించకుండా ఏదైనా చేసేస్తావా అని భాగమతి అంటుంది. అమ్మ అని చెప్పాక కూడా ఆలోచిస్తే అప్పుడు అమ్మ మీద నాకు ప్రేమ ఎక్కడ ఉన్నట్టు మిస్సమ్మ అని అంజు అంటుంది. మీ అమ్మ అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అంజు ఇంత చక్కటి పిల్లల్ని వదిలేసి అప్పుడే వెళ్లిపోయింది అని భాగమతి ఏడుస్తుంది. అక్కడే నిలబడి చూస్తున్న అరుంధతి కూడా తన మీద అంజు ఎంత ప్రేమ పెంచుతుందో అర్థం చేసుకొని ఏడుస్తుంది. ఇంతలో అమరేంద్ర మిస్సమ్మ అంజు అన్నం తిన్నదా అంటూ వస్తాడు.
అంజు అన్నం తినకుండా టాబ్లెట్ వేసుకుంటే జ్వరం ఎలా తక్కువ అవుతుంది చెప్పు ఒక ముద్ద తినమ్మా అని అమరేంద్ర అంటాడు. ఇప్పుడే అమ్మ ముద్ద కూడా తినేసాను డాడీ ఇక నాకు వద్దు అని అంజు అంటుంది. అయితే డాడీ ముద్ద నీకు వద్దా అని అమరేంద్ర నోట్లో పెడతాడు. అలా అంజుకి మాటలు చెప్పి అమరేంద్ర అన్నం తిన పెడతాడు. నీకు ఈ విద్య కూడా వచ్చా అని అరుంధతి అనుకుంటుంది. అందరి ముద్దులు తిన్నావు మిస్సమ్మ ముద్ద తినకపోతే ఫీల్ అవుతుంది కదా అని అమరేంద్ర అంటాడు. అమ్మ ముద్దనొచ్చు ఆకాష్ ముద్ద వద్ద అనొచ్చు ఏమి మిస్సమ్మ ముద్ద ఎందుకు అన్నారు మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదండి అని అరుంధతి అనుకుంటూ ఉంటుంది. అంజికి అన్నం తినిపించి అమరేంద్ర చేయి కడుక్కొని భాగమతి చున్నీకి చెయ్ తుడుచుకుంటాడు. నా చున్నీకి చేయి తుడుచుకున్నారేంటండి అని భాగమతి అడుగుతుంది. నీకు బొత్తిగా డిస్ప్లేన్ లేకుండా పోతుంది మిస్సమ్మ ఎక్కడపడితే అక్కడ చున్నివే పడేస్తారా ఒంటిమీద కదా వేసుకోవాలి అని అమరేంద్ర అంటాడు.
చున్నీ పక్కన పెట్టడం కూడా ఇంత పెద్ద తప్పు అని నాకు తెలియదు సార్ అని భాగమతి అంటుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అంటూ అమరేంద్ర చున్నీ తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నా చున్నీతో తుడుచుకొని నన్నే ఇంకోసారి తప్పు చేయకు అంటూ వెళ్ళిపోతాడా చున్ని పక్కన పెట్టడం కూడా ఇంత పెద్ద తప్ప అని భాగమతి అనుకుంటుంది. మా ఆయన అంటే ఏమనుకున్నావ్ మిస్సమ్మ అని అరుంధతి అనుకుంటుంది. కట్ చేస్తే, కొడైకెనాల్ ఎస్సై అమరేంద్ర కు ఫోన్ చేస్తాడు. అమర్ ఫోన్ మోగుతుంది లేడు ఏంటి అని తను ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది. సార్ లేడా మేడం అని అడుగుతాడు ఎస్ఐ. లేడు ఏంటో చెప్పండి అని మనోహరి అంటుంది. మేడం గారి హత్య చేసిన డ్రైవరు అడ్రస్సు ఫోటో అన్ని దొరికాయి మేడం అది చెబుదామని ఫోన్ చేశాను అని ఎస్ఐ అంటాడు. ఇంతలో అమరేంద్ర వచ్చి మనోహరి ఫోన్ ఎందుకు ఎత్తవు అని ఫోన్ లాక్కుంటాడు, హలో సార్ మేడం గారిని హత్య చేసిన డ్రైవర్ ఫోటో మీకు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కి పంపించాను సార్ అని అంటాడు ఎస్ఐ. నా భార్య ని చంపిన వాడిని నేనే పట్టుకొని పోలీసులకు అప్పగించాలి అది నా బాధ్యత అని అమరేంద్ర అంటాడు. ఓకే సార్ థాంక్యూ అని ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు. మనోహరి భయపడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనోహరి ఇంకోసారి ఎప్పుడూ నా ఫోన్ లిఫ్ట్ చేయకు అని అమరేంద్ర అంటాడు.
ఇంపార్టెంట్ కావాలనుకుని లిఫ్ట్ చేశాను అని మనోహరి అంటుంది. ఆఫీస్ నుంచి ఇంపార్టెన్స్ కాల్స్ వస్తాయి అందుకే ఎత్తొద్దు అంటున్నాను అని అమరేంద్ర వార్నింగ్ ఇస్తాడు సారీ అమర్ ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను అని మనోహరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తన రూమ్ లోకి వెళ్లి అమర్ కి ఆ డ్రైవర్ దొరికితే నా పని అయిపోయినట్టే నన్ను చంపేస్తాడు అని భయపడుతుంది మనోహరి. ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి హైదరాబాదులో ఉన్న పోలీస్ స్టేషన్ కి కొడైకెనాల్లో పోలీసులకి అందరికీ నీ గురించి తెలిసిపోయింది నువ్వు వెంటనే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని మనోహరి అంటుంది. హైదరాబాద్ పోలీసులకి నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది మేడం అని ఆ రౌడీ అంటాడు. అమరేంద్ర ఎంక్వయిరీ చేయించాడు నువ్వు దొరికితే నేను దొరికిపోతాను కొంతకాలం నువ్వు ఎవరికీ కనిపించకుండా ఉండు జాగ్రత్తగా వెళ్ళు అని మనోహరి చెబుతుంది.రేయ్ నేను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాలి పోలీసులకు నేను హైదరాబాదులో ఉన్నట్టు తెలిసిపోయిందట అని ఆ రౌడీ ఫ్రెండ్స్ తో చెప్తాడు.
రేయ్ నువ్వు భయపడి పారిపోవడం ఎందుకురా అవసరం ఆవిడది దీన్ని అడ్డుపెట్టుకొని ఆవిడ దగ్గర డబ్బులు లాగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరా డబ్బు తీసుకొని సిటీలోనే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. ఈ ఐడియా ఏదో బాగుందిరా అని ఆ రౌడీ అనుకుంటాడు. కట్ చేస్తే, గుప్తా గారు చెట్లకి నీళ్లు పడుతూ ఉంటాడు రాథోడు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. గుప్త రాథోడ్ మీద పైపు పట్టి నీళ్లు పడతాడు. ఏయ్ చూసుకోవా నీళ్లు చెట్లకు పడుతున్నావా నాకు పడుతున్నావా అని రాథోడ్ అంటాడు.
నేను చెట్లకే పట్టు చుంటిని మీకు ఎందులకు పట్టుదున్ను అని గుప్తా అంటాడు. తెలంగాణ భాష తెలుసు ఆంధ్ర భాషా తెలుసు నీది ఏ భాష రా బాబు నాకు అర్థమై చావదు అని రాథోడ్ అంటాడు. మాది యమలోకపు భాష ఇటులనే ఉండును అని గుప్తా అంటాడు. పానీ పూరి నీలపూరి ఇంకేమైనా కాదా అని రాథోడ్ చిరాకు పడుతూ అంటాడు. రాథోడ్ ఎవరితో గొడవ పడుతున్నాడు అని అరుంధతి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!