Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం వచ్చా ఎందుకలా నడుపుతున్నారు బండి ఆపండి అని స్వర అంటుంది. ఎందుకు ఏమైంది స్వర అని అభిషేక్ అంటాడు. మీరు బండి తోలుతున్నారా సైకిల్ తొక్కుతున్నారా గుంతలో వెళుతుంది బండి అని స్వర అంటుంది. బండి తోలుతే అర్థమవుతుంది ఇక్కడ గుంటలు ఉన్నాయి కాబట్టి అలా బండి వెళ్తుంది నన్నేం చేయమంటావు అని అభిషేక్ అంటాడు. మీ మగవాళ్ళ బుద్ధి అంతే ఆడవాళ్ళు వెనక కూర్చుంటే చాలు అలాగే తోలుతారు అని స్వర అంటుంది. నువ్వు బండి తోలితే అర్థమవుతుంది అని అభిషేక్ అంటాడు.నీతో సినిమాకు రావడం నాకు ఇష్టం లేదు అని స్వర అంటుంది.నువ్వు సినిమాకి రాకపోతే చామంతి ఫీల్ అవుతుంది అని అభిషేక్ అంటాడు.
చామంతి బాధ పడకుండా ఉండాలి అన్నా నేను బాధపడకుండా ఉండాలి అన్నా నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి రెండు గంటల తర్వాత రండి ఇద్దరం కలిసి ఇంటికి వద్దాం అప్పుడు చామంతి ఫీల్ అవ్వదు అని స్వర అంటుంది.ఇంతలో నాగరత్నం వాళ్ళని చూసి ఏంటి మీరు ఇద్దరు ఇక్కడ గొడవ పడుతున్నారు అని అడుగుతుంది. ఏమి లేదు మేడం నేను అర్జెంట్గా ఆఫీస్ కి వెళ్ళాలి స్వర బయటికి తీసుకెళ్ళమంటే నాకు వీలు కాదని చెబుతున్నాను అని అభిషేక్ అంటాడు. నేను గుడికి వెళుతున్నాను స్వర నాతో పాటు రా అని నాగరత్నం స్వరని గుడికి తీసుకు వెళుతుంది. అభిషేక్ స్టేషన్ కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, నాగరత్నం గుడికి వస్తుంది. పంతులుగారు జాతకాలు చూశారా అని మిరియాలు అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పంతులుగారు పూజ చేయండి అని నాగరత్నం అంటుంది. పంతులు గారు పూజ చేస్తారు.
స్వర నువ్వు అక్కడ కూర్చో నేను కొద్దిసేపు తర్వాత వస్తాను అని నాగరత్నం పూజారితో మాట్లాడుతుంది. పంతులుగారు జాతకాలు చూశారా ఎలా ఉన్నాయి అని అడుగుతుంది నాగరత్నం. అమ్మ ఆ జాతకం చూశాను మీరు చేయాలనుకున్న పని మూడు వంతులు కాదనిపిస్తుంది ఆ జాతకం ఉన్న వ్యక్తి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని పంతులుగారు అంటారు. నాగరత్నం ఏంటి ఏడుస్తుంది ఇందాక మిరియాలు ఏదో జాతకాల గురించి మాట్లాడాడు చామంతి జాతకం గురించి చూపించి బాధపడుతుందా అని అనుకుంటుంది.
నాగరత్నం వచ్చి స్వర ఇక్కడ జాతకాలు బాగా చెబుతాడు పంతులుగారికి నీ జాతకం చూపించుకో అని నాగరత్నం అంటుంది. నా జాతకం ఏంటో నాకు తెలుసు ఆంటీ అని స్వర అంటుంది. మీ అమ్మానాన్న ఏం చేస్తుంటారు అని నాగరత్నం అడుగుతుంది. మా అమ్మ చనిపోయింది ఆంటీ అని స్వర చెబుతుంది. మీ నాన్నగారు ఏం చేస్తారు అని నాగరత్నం అడుగుతుంది. ఆయన ఈ మధ్య చనిపోయారు అని స్వర చెబుతుంది.
మీ నాన్న పేరు ఏంటమ్మా అని నాగరత్నం అడుగుతుంది. మా నాన్న పేరు పెద్ది నాయుడు మాజీ మినిస్టర్ అని స్వర చెబుతుంది. నువ్వు పెద్ది నాయుడు కూతురివా మాజీ మినిస్టర్ మీ నాన్న పాపం పోనీలే అభి లాంటి మంచి అబ్బాయి నీకు భర్తగా దొరికాడు అని నాగరత్నం అంటుంది. కట్ చేస్తే, ఇతను ఎవరు అని చామంతి అడుగుతుంది. ఇతను నాతోపాటు ట్రాన్స్ఫర్ ఇచ్చిన కానిస్టేబుల్ అతని పేరు నీలకంఠం అని పరిచయం చేస్తాడు అభిషేక్.అభి సినిమాకి వెళ్లారా లేదా అని చామంతి అడుగుతుంది. మీరు సినిమాకి వెళ్లారో లేదో నా బొమ్మ చెబుతుంది అని చామంతి అనడంతో నాగరత్నం స్వర అక్కడికి వస్తారు. స్వర నీకు ఎక్కడ కలిసింది అమ్మ అని చామంతి అంటుంది. గుడికి వెళ్ళొస్తుండగా దారిలో కనిపించింది అని నాగరత్నం చెబుతుంది. నీలకంఠం అన్నయ్య నువ్వు ఎప్పుడొచ్చావు అని స్వర అడుగుతుంది. నేను ఇందాకే వచ్చానమ్మా మధ్యాహ్నం లంచ్ కి వస్తాను వంట చెయ్ అని నీలకంఠం అంటాడు.
ఇప్పుడు అన్నయ్య ఇంటికి లంచ్ కోస్తే మేమిద్దరం వేరు వేరుగా వండుకుంటున్నామని తెలిసిపోతుంది అని స్వర అనుకుంటుంది. నీలకంఠం మనకి స్టేషన్లో పని ఉంది వెళ్దాం పద అని అభిషేక్ నీలకంఠంని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అబ్బో కానిస్టేబుల్ ఇంటికి లంచ్ కి వస్తాను అనగానే వాళ్ళిద్దరు ఎందుకు అంతలా టెన్షన్ పడ్డారు వాళ్ళిద్దరు అసలు భార్యాభర్తలేనా వాళ్ళ మధ్యలో సక్యత లేదు అని చామంతి అంటుంది. నీకొచ్చిన డౌటే నాకు మొదటి రోజు రావడంతో వాళ్ళని అడిగాను కానీ వాళ్ళిద్దరూ సమాధానం మాత్రం చెప్పలేదు మేము బాగానే ఉన్నామన్నారు కానీ వాళ్ళని చూస్తుంటే వాళ్ల మధ్య సఖ్యత లేదనిపిస్తుంది వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళ మధ్యలోకి మూడో వ్యక్తి రావాల్సి ఉంటుంది అని నాగరత్నం అంటుంది. వాళ్ళిద్దరూ బాగుండాలి వాళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రాకూడదు అని చామంతి అంటుంది.