Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టంబర్ 3న తారీకు నుండి ప్రారంభమయ్యింది. గత సీజన్స్ మాదిరిగా కాకుండా మొదటి వారం నుండి హౌస్ లో పోటీ వాతావరణం ఉండేలా ఇంటి సభ్యులకు టాస్కులు మీద టాస్కులు పెడుతున్నారు. మొత్తం 14 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ అవ్వగా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. రెండు వారాల ఎలిమినేషన్ లలో… ఇద్దరూ లేడీ కంటెస్టెంట్స్ యే ఎలిమినేట్ కావడం జరిగింది. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ లో ఎక్కువగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ లేడీ కంటెస్టెంట్ రతిక ఇద్దరూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
ప్రశాంత్ ఆట తీరు చూస్తే చాలా వరకు సింపతి సంపాదించడానికి అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక రతిక చాలా దూకుడుగా గేమ్ ఆడుతూ ఉంది. ఒక్కోసారి కొంతమంది మగ కంటెస్టెంట్ లను రెచ్చగొట్టే రీతిలో గేమ్ ఆడుతుంది. తాజాగా ఈ రకంగానే మూడో వారంలో పల్లవి ప్రశాంత్ తో వ్యవహరిస్తోంది. ఆల్రెడీ మొదటి వారంలోనే పల్లవి ప్రశాంత్ ఫీలింగ్స్ తో ఆటాడుకుంది.
తర్వాత ప్రిన్స్ యావర్ నీ కూడా రెచ్చగొట్టే రీతిలో ఆడింది. ఈ క్రమంలో రెండో వారం వీకెండ్ షోలో నాగార్జున మనుషులతో ఆట్లాడుకోవద్దు గేమ్.. ఆడు అని రతికాకి సూచించడం కూడా జరిగింది. అయినా గాని రతికా.. ప్రశాంత్… పొద్దు పొద్దున్నే.. మీటింగులు పెడుతూ ఉన్నారు. రెండో వారంలో వీరిద్దరి మధ్య గొడవలు చేసుకోవడంతో చాలా రోజులు మాట్లాడుకోలేదు.
తర్వాత ప్రశాంత్ వెళ్లి రతికాతో తనకి ఉన్న మనస్పర్ధలు తొలగించుకుని మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ కావడం జరిగింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి టాపిక్ మళ్ళీ ట్రెండింగ్ లో నడుస్తూ ఉంది. ఈ సీజన్ సెవెన్ లో రతికా వ్యవహరిస్తున్న తీరు.. ఆమె మాజీ లవర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి చిరాకు తెప్పిస్తుందట.
తనతో క్లోజ్ గా ఉన్న అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో అన్ని కెమెరాలు ముందు క్లోజ్ అవ్వటం… తట్టుకోలేకపోతున్నాడట. ముఖ్యంగా రాత్రి అయితే ప్రశాంతతో తెల్లవార్లు మీటింగ్లు పెట్టడం.. మిగతా వారిని పెద్దగా పట్టించుకోకుండా అతనితోనే క్లోజ్ గా ఉండటంతో రాహుల్..రతికా ఆట తీరుపై చిరాకుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.