Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్.. పదో వారం ముగించుకుని 11వ వారంలో అడుగుపెట్టబోతుంది. ఆదివారం ఎపిసోడ్ లో దీపావళి సంబరాలు జరగవు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. పదో వారం లో హౌస్ మేట్స్ ఇంటి సభ్యులు రావడం జరిగింది. ఆదివారం స్పెషల్ ఎపిసోడ్లో కూడా మరి కొంతమంది ఇంటి సభ్యులు రావడం జరిగిందట. శివాజీ వాళ్ళ వైఫ్ తో పాటు చిన్న కుమారుడు రావడం జరిగింది. అమర్ దీప్ కోసం వాళ్ళ అమ్మగారు రావడం జరిగింది అంట. గౌతమ్ కోసం వాళ్ళ అన్నయ్య వచ్చారట. యావర్ కోసం జబర్దస్త్ ఇమ్మానుయేల్ వచ్చారంట. పల్లవి ప్రశాంత్ కోసం.. తల్లి మరియు చెల్లి రావడం జరిగింది అంట.
బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ సోహైల్.. కూడా రావడం జరిగిందట. ఇక మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ లీల కూడా వచ్చిందట. దీపావళి ఎపిసోడ్ లో చాలామంది సినిమా సెలబ్రిటీలు రావడం జరిగింది అంట. ఇదిలా ఉంటే పదో వారంలో కెప్టెన్సీ టాస్క్ లో చివరకు శివాజీ కావడం జరిగింది. ఫస్ట్ టైం శివాజీ హౌస్ లో కెప్టెన్ కావటం జరిగింది. ఇప్పటికే పెద్దరికం చేస్తున్నట్టు గేమ్ ఆడుతుండటంతో కెప్టెన్ కావడంతో మనోడు ఎలాంటి రూల్స్ పెడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు పదో వారం నామినేషన్ లో ఉన్న శివాజీ సగానికి పైగా ఓటింగ్ కైవసం చేసుకున్నాడు.
దాదాపు గేమ్ చివర ఆఖరికి రావడంతో… టైటిల్ పోరు విషయంలో బయట గట్టిగానే డిస్కషన్స్ జరుగుతున్నాయి. కచ్చితంగా శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్ టాప్ ఫైవ్ లో ఉంటారని అంటున్నారు. టైటిల్ మాత్రం శివాజీ లేదా అమర్ ఇంకా ప్రశాంత్ ఈ ముగ్గురిలో ఒకరు కైవసం చేసుకుంటారని ఆడియన్స్ భావిస్తున్నారు. చాలా వరకు శివాజీ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయనీ అంటున్నారు. చాలా పెద్దరికంగా బ్యాలెన్స్ గేమ్ ఆడుతూ.. ఫిజికల్ గా కూడా రాణిస్తూ ఉండటంతో అతడికే టైటిల్ వచ్చే అవకాశం ఉందని బయట గట్టిగా నమ్ముతున్నారు.