వర్షాకాలం వస్తూ వస్తూ అనేక రకాల వ్యాధులను మూటగట్టుకుని వస్తుంది.. ఈ కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము.. ఈ కాలాన్ని మనం ఆస్వాదించాలి అంటే మనం అంత ఆరోగ్యంగా ఉండాలి.. మనం తినే ఆహారంలో పోషక విలువలతో పాటు మన రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవాలి.. మనం వంట చేసేటప్పుడు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మనం మార్కెట్ నుంచి కూరగాయలు పండ్లను తీసుకొచ్చిన వెంటనే వాటిని శుభ్రంగా కడగడంతో పాటు మన చేతుల్ని కూడా శుభ్రం చేసుకోవాలి . అలాగే ఆహారం తినటానికి ముందు తిన్న తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. వంట చేసిన తర్వాత కూడా ప్రదేశం అంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా మాంసం చేపలు, చికెన్ గుడ్లు వంటి ఆహార పదార్థాలను వండిన తర్వాత ఉండలేదని శుభ్రపరుచుకోవాలి . ముఖ్యంగా వీటిని ఫ్రిజ్లో ఎక్కువ రోజులు ఉంచుకొని తినకూడదు. ఈ కాలంలో చికెన్, మటన్ వంటి వాటిని కట్ చేయడానికి వేరే చాప్ బోర్డును పెట్టుకుంటే బెటర్..
వర్షాకాలంలో వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. వేడి వేడి అన్నం, సాంబార్ టీ సూప్ ఇలా ఏదైనా సరే కాస్త వేడిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఈ కాలంలో ఫ్రిజ్లో పెట్టిన ఆహారాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, జున్ను వంటివి తినకూడదు.. ప్రతిరోజు ఇంటిని తడి గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా ఈగలు ఇంట్లో ముసురుతూ ఉంటాయి. అలాగే దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలం ఎంచక్కా ఆస్వాదించవచ్చు..