చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బెల్లంను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.ఇప్పుడంటే చిరుతిళ్లుగా చాలా రకాల వెరైటీ ఐటమ్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి కానీ పూర్వకాలంలో బెల్లం,వేయించిన బఠానీలు, కొబ్బరి ముక్క, వేరు శెగనలను చిరుతిళ్లుగా తినేవారు.నిజానికి ఇప్పటి తిండి కన్నా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు తినే తిండే ఎంతో ఆరోగ్యకరమైనది. ఇప్పటి చిరుతిళ్లు తినడం వల్ల శరీరానికి నష్టమే కానీ ఎలాంటి లాభమూ లేదు. అందుకే శెనగలను సన్న మంట పెట్టి వేయించుకుని వాటితో పాటు చిన్న బెల్లం ముక్కను కలిపి తింటే రుచికి రుచితో పాటుగా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.ఈ కాంబినేషన్ లో ఆహారం తినడం వలన శరీరరానికి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
జీర్ణక్రియ ప్రక్రియ :
వేయించిన శెనగలు, బెల్లం కలిపి తినడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
రోగనిరోధక శక్తి:
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే త్వరగా అనారోగ్యాల బారిన పడతాము.అందుకే వ్యాధులతో పోరాడే శక్తి మనలో ఉండాలంటే రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉండాలి. అందుకే రోజూ బెల్లం, వేయించిన శెనగలు కలిపి తింటే శరీరంలో ఇమ్మ్యూనిటి శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గడంలో :
వేయించిన శెనగలు, బెల్లం క్రమంతప్పకుండా తింటే బరువు తగ్గుతారు.ఇవి తింటే శరీరంలో అదనపు కొవ్వు చేరకుండా కాపాడతాయి. వీటిని మితంగా తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
దంతాలు గట్టిగా :
మనం ఏదన్నా ఆహారం తినాలంటే ముఖ్యంగా దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. శెనగలు, బెల్లం రెండు కలిపి తింటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.వీటిలో ఫాస్పరస్ ఉండడం వల్ల దంతాలు గట్టిగా మారుతాయి.