Beetroot: సాధారణంగా బీట్రూట్ దుంపలను తినడం ద్వారా అనేక పోషకాలు అందుతాయి అని మనమందరం అనుకుంటాం. ఎస్ ఇది నిజమే. కానీ బీట్రూట్ దుంపలని తినడం ద్వారా కొందరికి పోషకాలు అందితే మరికొందరికి మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ బీట్రూట్ ని తినడం ద్వారా వారి ప్రాణానికే ప్రమాదం. బీట్రూట్ లో ఉండే పోషకాలు కారణంగా బ్లడ్ పడుతుందని డాక్టర్లు సైతం చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే బీట్రూట్ తినాలి. మరికొందరు మాత్రం అస్సలు తినకూడదు. మరి బీట్రూట్ తినకూడని వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతున్నటువంటి వారు బీట్రూట్ దొంపని దూరంగా పెట్టాలి. లేదంటే అనేక సమస్యలు ఏర్పడతాయి.
2. అదేవిధంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు కూడా బీట్రూట్ ని దగ్గరికి రానివ్వకూడదు. అలా తినడం ద్వారా కిడ్నీ ప్రమాదం మరింత పెరుగుతుంది అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
3. చంటి పిల్లలకు బీట్రూట్ తో చేసిన రసాన్ని కానీ ఇతర రసాన్ని కానీ అస్సలు ఇవ్వకూడదు. అదేవిధంగా పాలిచ్చే స్త్రీలు మరియు గర్భిణీ స్త్రీలు బీట్రూట్ ని తినక పోవడమే మంచిది.
4. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు కూడా ఈ దుంపలతో చేసిన మరే ఆహారం తీసుకోకూడదు. కొందరికి ఈ బీట్రూట్ దుంపల ద్వారా ఎలర్జీ కలుగుతుంది.
5. అంతేకాకుండా మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు కూడా బీట్రూట్ ని తీసుకోకూడదు.
పైన చెప్పిన ఐదు వ్యాధులతో బాధపడుతున్న వారు బీట్రూట్ ని తినకపోవడమే ఉత్తమం.