పశ్చిమ బెంగాల్ లో సుమారు 2 శాతం మేర తెలుగు వారు.. తెలుగు వచ్చిన వారున్నారు తెలుసా..!! ఖరాగపూర్ , కోల్ కతాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లోనూ తెలుగువారు కనిపిస్తారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడికి వెళ్లి స్థిరపడిన వారు కనిపిస్తారు. వారికీ బెంగాలీ వచ్చినా ఇళ్లలో మాత్రం తెలుగు మాట్లాడతారు . వీరికి మొదటి నుంచి స్థానిక పార్టీలు ఆవాసం కల్పిస్తూ వారికీ అన్ని హక్కులు కల్పించాయి. వీరికి అన్ని రకాల ధ్రువపత్రాలు ఇక్కడ ఉన్నాయి… అయితే రాజకీయంగా మాత్రం వీరు అధికారంలో ఉన్నా పార్టీల వైపు ద్రుష్టి పెడతారు. ఎక్కువగా వామపక్ష పార్టీల వైపు తెలుగు వారు మొగ్గు చూపడం ఎక్కువ. దింతో ఈ సారు దీదీ కన్ను తెలుగువారిపై పడింది…
** వచ్చే ఏడాది మొదట్లోనే జరగబోయే ఎన్నికలు బెంగాల్ లో కీలకం కానున్నాయి. దీదీ మమతా బెనర్జీ కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఇస్తుంది. ఇప్పటికే జేపీ నడ్డా , అమిత షా వంటి వారు బెంగాల్ కు వచ్చి పోయారు. మమతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి సైతం కొందరు ఎమ్మెల్యే లు బీజేపీ లోకి చేరారు. దింతో రోజు ఒక రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. అధికార పార్టీ బలంగానే కనిపిస్తున్నా , బీజేపీ అంతే వేగంతో దూసుకు వస్తుంది. ఈ కీలక సమయంలో తృణమూల్ కు ప్రతి వోట్ కీలకమే… దీన్ని దీదీ గుర్తించారు… ఎట్టకేలకు బెంగాల్ లో తెలుగుకు అధికార బాషా హోదా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
** తెలుగు వారు ఎప్పటి నుంచో దీన్ని కోరుతున్నారు. లక్షల్లో ఉన్నా తెలుగు వారిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లా ల నుంచి బెంగాల్ వెళ్లి అక్కడ ఏళ్లుగా ఉంటున్నారు. వివిధ వ్యాపారాలు, కూలి నిమిత్తం అక్కడా ఉండిపోయినవారు కనిపిస్తారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరుచు బెంగాల్ కు వారి బంధువులు వెళ్లి రావడం కనిపిస్తుంది. అక్కడివారు ఒక సంఘంగా ఏర్పడి ఎప్పటి నుంచో అధికార భాషగా తెలుగు గుర్తించాలని కోరుతున్నారు. దింతో పాటు తమ రక్షణకు , ఇళ్ల స్థల కోసం అభ్యర్ధనలు పెట్టారు. ఎట్టకేలకు అధికార బాషా హోదా ఇచ్చిన మమతా దీదీ తమ ఇతర సంస్థాలు తీరిస్తే ఆమె కె మద్దతుహ నిలుస్తామని తెలుగువారు చెబుతున్నారు… దీదీ సైతం ఇదే ఊపుతో తెలుగు వారి సమస్యలు తీర్చి వారి ఓట్లను టిఇపుకునే వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
** బంగాల్ అధికార భాషల జాబితాలో తెలుగు ను మంగళవారం జరిగిన పశ్చిమ్ బంగా కేబినెట్ ఆమోదించింది, ఏకగ్రీవ తీర్మానం ద్వారా తెలుగుకు హోదా కల్పించింది. కేబినెట్ సమావేశం అనంతరం.. విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ ఈ విషయం వెల్లడించారు. బంగాల్లో ఇప్పటికే 10కిపైగా అధికార భాషలున్నాయి. ఈ పదికి అదనంగా బంగాల్ అధికార భాషల్లోకి తెలుగు కూడా చేరింది. మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది మమత సర్కార్. తెలుగును అధికార భాషగా ఆమోదించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ వెల్లడించారు. తెలుగును అధికార భాషగా చేయాలని బంగాల్లోని తెలుగువారు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో అన్నారు. ”తెలుగును అధికార భాషగా చేయాలని.. ఆ కమ్యూనిటీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఖరగ్పుర్ సదర్ నుంచి ఎమ్మెల్యే ప్రదీప్ సర్కార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఈ అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో.. తెలుగును అధికార భాషగా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరగ్పుర్లో అధికంగా ఉండే తెలుగు ప్రజల డిమాండ్ మేరకే దీనిని పరిగణనలోకి తీసుకున్నాం అని విద్య శాఖా మంత్రి పార్థ ఛటర్జీ మీడియా కు చెప్పారు.