President Election schedule: భారత రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదలైంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేశారు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెల 15న జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే జోరు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తామనీ, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. జూలై 2వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించడం జరిగిందన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
President Election schedule: జూలై 18న పోలింగ్
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. ఆ తరువాత జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుందని, ఈ నేపథ్యంలో జూలై 25లోగా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉందని, కావున అందుకు అనుగుణంగా షెడ్యుల్ ను ఖరారు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జరుగుతాయనీ, పోలింగ్ మాత్రం పార్లమెంట్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణలో జరగనున్నట్లు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పార్టీలు విప్ జారీ చేయకూడదు
ఎన్నికలకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని రాజీవ్ కుమార్ వివరించారు. ఓటింగ్ లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431 అని సీఈసీ తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్ధిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే అది చెల్లుబాటు కాదు. అంతే కాదు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయకూడదు. ప్రజా ప్రతినిధులకు స్వేచ్చగా ఓటు వేసే అవకాశం ఉంటుంది.