Pakistan Fisherman: కొందరు జీవిత కాలం కష్టపడినా లక్షాధికారులు కాలేరు, కానీ కొందరు మాత్రం తమ కష్టంతో ఎదుగుతారు. మరి కొందరికి అదృష్టం కలిసి వచ్చి లక్షాధికారులు అవుతుంటారు. తాము కొన్న లాటరీ టికెట్ ద్వారా లక్షాధికారులు అయిన వారు ఉన్నారు. అదృష్టం కలిసి వచ్చి పాకిస్థాన్ లో ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఒక్కో సారి ఎంతో అరుదైన చేపలు పడుతుంటాయి. ఆ చేపల విశిష్టత వల్ల వాటి ధర లక్షల్లో పలుకుతుంది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు అలాంటి అరుదైన చేప వల్ల రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.
Read More: heroine chandini: మాజీ మంత్రి పై ఓ సినీ నటి సంచలన ఆరోపణలు..తమిళనాట హాట్ టాపిక్ ఇదే..
జివానీలో నివాసం ఉండే ఈ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లిన సమయంలో అతని వలలో ఎంతో అరుదన క్రోకర్ పిష్ పడింది. ఈ చేపను స్థానికంగా సోవా లేక కిరి చేప అంటారు. ఈ చేప 48కేజీల బరువు ఉంది. దాన్ని వేలం వేయగా కొనుగోలుదారులు పోటీ పడటంతో అసాధారణంగా రూ.8.64 లక్షలు (పాకిస్థాన్ కరెన్సీ) ధర పలికింది.ఈ చేపకు అంత డిమాండ్ ఎందుకు ఉందంటే చేపలోని ఓ భాగాన్ని ప్లార్మా రంగంలో ఉపయోగిస్తారుట. శస్త్రచికిత్సలో ఉపయోగించే పరికరాల తాయారీకి దీన్ని వినియోగిస్తారు.
ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్ లో ఈ చేపకు అత్యధిక ధర పలుకుతుంది. ఇదే ప్రాంతంలో ఇటీవల ఇలాంటి చేప ఒక లభ్యం కాగా దానికి రూ.7.80 (పాకిస్థాన్ కరెన్సీ) లక్షల ధర పలికినట్లు సమాచారం. సముద్ర జలాల్లో ఈ తరహా చేపలు తరచు లభ్యమవుతుంటాయి. ఈ రకం చేపలు దొరికిన మత్య్సకారులను అదృష్టవంతులుగా భావిస్తుంటారు.