Aacharya : ఆచార్య లో పూజా హెగ్డే నటిస్తుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న152వ సినిమాగా ఆచార్య రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ – కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలలో రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆచార్య ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇటీవలే ఆచార్య సినిమాలో సిద్ద పాత్ర పోషిస్తున్న రాం చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే చరణ్ కి జంటగా హీరోయిన్ ని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. గత కొన్ని రోజులుగా చరణ్ పాత్ర కి సంబంధించి ఆ పాత్ర నిడివి గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చాయి. కాగా ఆచార్య లో చరణ్ ది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇక చరణ్ కి జంటగా నటించే హీరోయిన్ ది మాత్రం కాస్త చిన్న పాత్ర అని సమాచారం. అయినా కూడా చిత్ర యూనిట్ బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నారట.
Aacharya : ఆచార్య లో చరణ్ కి జంటగా నటించేందుకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ..?
ఈ క్రమంలోనే పూజా హెగ్డే ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆచార్య లో చరణ్ కి జంటగా నటించేందుకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి రెమ్యూనరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. స్క్రీన్ మీద కనిపించేది కొద్ది సేపే అయినా సినిమా మొత్తానికి తీసుకునే రెమ్యూనరేషన్ కావాలని చెప్పినట్టు సమాచారం. అయితే మేకర్స్ పూజా హెగ్డే కి ఉన్న క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని తననే తీసుకోవాలని డిసైడయ్యారట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. కాగా పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రెండు తెలుగు కాగా రెండు బాలీవుడ్ సినిమాలు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!