నాకింకా బిగ్ బాస్ 3 పేమెంటే రాలేదు.. అంటూ సంచలన ఆరోపణలు చేసింది ఓ కంటెస్టెంట్. ఆమె ఎవరో కాదు.. కస్తూరి శంకర్. బిగ్ బాస్ 3 తమిళ్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న కస్తూరి తాజాగా ఈ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది.
బిగ్ బాస్ 3 పూర్తయి ఏడాది గడిచినా.. ఇంకా నాకు ఇవ్వాల్సిన పారితోషకం ఇవ్వలేదు. అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు మాత్రమే నేను బిగ్ బాస్ షోలో పాల్గొన్నా. కానీ.. ఇప్పటి వరకు నాకు ఆ పేమెంట్ ఇవ్వలేదు. నిజానికి నేను ప్రామీసులను నమ్మను. కానీ.. బిగ్ బాస్ నిర్వాహకులు తప్పుడు ప్రామీసులు చేస్తారని నేను ఊహించలేదు.. అంటూ కస్తూరి సంచలన ట్వీట్ చేశారు.
గత సంవత్సరమే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 పూర్తవగా.. బిగ్ బాస్ 4 వ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కస్తూరి శంకర్.. అప్పట్లో తెలుగులో హీరోయిన్ గా వెలుగొందారు. అన్నమయ్య సినిమాలోనూ కస్తూరి నటించింది. తెలుగులో హీరోయిన్ గా నటించిన తర్వాత కొన్ని రోజులకు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కస్తూరి.. కొన్ని సీరియళ్లలోనూ నటిస్తోంది.
No words to thank @vijaytelevision who have withheld my payment for over a year.
நான் பிக் பாஸ் நிகழ்ச்சியில கலந்துக்கிட்டதே manumission குழந்தைகளோட ஆப்பரேஷன் செலவுக்காகத்தான். I never believed any of your fake promises, but even I didnt expect this.— Kasturi Shankar (@KasthuriShankar) September 29, 2020