(శ్రీనగర్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారత సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్లోని పూంఛ్ జిల్లా కృష్ణఘాటి, మన్కోట్ సెక్టార్ లో అర్థరాత్రి కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత అర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవానులు తీవ్రంగా గాయపడ్డారు.
పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పరిపాటిగా మారిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు
గత నెలలో జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని ఖోరీ దాబా ప్రాంతంలో మందుపాతర పేలి ఒ సైనికాధికారితో పాటు ఇద్దరు తీవ్ర గాయాలు గాయపడిన విషయం తెలిసిందే. సరిహద్దు వద్ద ఉగ్రవాద సంస్థల మిలిటెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా భారత సైన్యం అప్రమత్తంగా వారి దాడులను తిప్పికొడుతోంది.