Wimbledon 2021: మరో ఇరవై రెండు రోజుల్లో టోక్యో ఒలంపిక్ క్రీడలు మొదలు కానున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ప్రతిష్టాత్మకంగా వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో ఇండియన్ స్టార్ సానియా మీర్జా శుభారంభం చేయడం జరిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సానియా మీర్జా అమెరికా ప్లేయర్ బెతనీ మ్యాటెక్ సాండ్స్ తో…కలిసి అద్భుత విజయం సాధించడం జరిగింది. ఈ గురువారం జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో 7-5, 6-3 తేడాతో ప్రత్యర్థులపై విజయం సాధించడం జరిగింది.
దాదాపు గంట 28 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్ లో సానియా జోడీ వరుస సెట్లలో గెలుపొందడం జరిగింది. సానియా మీర్జా వింబుల్డన్ లో 2017వ సంవత్సరంలో చివరిసారిగా బరిలోకి దిగింది. ఆ తరువాత నాలుగు సంవత్సరాల తర్వాత గెలవడంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే ఒలంపిక్స్ ప్రారంభానికి ముందు… ఈ ప్రతిష్టాత్మక టోర్నీ గెలవడంతో సానియా మీర్జా పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. తాజా విజయంతో సానియా కెరియర్ లో 121 విజయాలు నమోదు అయ్యాయి. 34 వయసు కలిగిన సానియా అతి ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో విజయం సాధించడంతో ఆమె ఆత్మ విశ్వాసం మరింతగా పెరిగింది.