Ancestors: ప్రతి రోజూ దేవుడిని పూజించడం, ప్రదించడం వంటివి హిందువుల ఆనవాయితీ గా వస్తుంది. ఇష్టదైవం ఒకటి అయితే, ఇంటి దైవం వేరొకటి అవుతుంది. ఇలా ఏదైనా కూడా ప్రతి రోజూ ఆయా దేవుళ్ళకు ప్రత్యేక పూజలు, సందర్భాన్ని బట్టి వ్రతాలు చేస్తుంటారు. నిత్యం భగవంతుండిని కొలవడం వలన మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిస్థితి, శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి అని బలంగా నమ్ముతారు.
అలాగే దేవుళ్లతో పాటు.. ఇంటిలో తరతరాలుగా పాటిస్తున్న పద్దతి లో తాతలు, ముత్తాతల పట్ల గౌరవభావం తో ఉంటారు. చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుని పూజిస్తుంటారు..వీరినే పితృ దేవతలు అని అంటారు. దేవతల అనుగ్రహం తో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా ఉండాలి అని చెబుతుంటారు. పితృ దేవతల అనుగ్రహం కోసం వారి తిథులలో బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం పెద్దల పేరుమీద పేదలకు వస్త్రాలు ఇవ్వడం చేసి గౌరవించాలి.ఇలా చేయడం వలన సకల శుభాలు చేకూరతాయి.
అయితే వారిని ఇలా పూజించడం మంచిదే కానీ… మరణించిన తాత, ముత్తాతల ఫోటోలు పూజ గదిలో పెట్టుకోవడం సరైన పని కాదు అని వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు. చాలామంది పెద్దలకు గౌరవం ఇచ్చే భావనతో పూజ గదిలో మరణించిన వారి ఫోటోలు పెట్టుకుంటున్నారు.
అలా పెట్టుకోవడం వలన అవి మన దృష్టిని, ఆలోచనలు మరల్చడం తో పాటు బాధాకరమైన జ్ఞాపకాలు తెప్పిస్తాయి అని వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు. అందుచేత తాతముత్తాల ఫోటోలను హాలులో కాస్త ఎత్తుగా లైట్ల డెకరేషన్తో ఏర్పాటు చేసుకోవడం మంచిది అని తెలియచేస్తున్నారు.