Keerthi Suresh : సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చలామణి అవుతూ అనేక అవకాశాలు దక్కించుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా జాతీయ అవార్డు సైతం దక్కించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మరో అరుదైన ఘనత కీర్తి సురేష్ దక్కించుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన ప్రతిభావంతమైన యువ తారల జాబితాలో కీర్తి సురేష్ చోటు దక్కించుకుంది.
Keerthi Suresh ‘థర్టీ అండర్ థర్టీ’
దేశ వ్యాప్తంగా 30 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న భారతీయ యువతీ యువకుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ‘థర్టీ అండర్ థర్టీ’ పేరుతో మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఈ జాబితాలో.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో కీర్తి సురేష్ చోటు దక్కించుకుంది. దీంతో ఈ వార్త తెలుసుకుని ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. మరోపక్క తనకి ఈ అరుదైన గుర్తింపు రావడం పట్ల ట్విటర్లో సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ తనని గుర్తించినందుకు మ్యాగజైన్ లో స్థానం లభించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో అదేవిధంగా నితిన్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తూ రాణిస్తోంది.