AP CID: దేశంలో కరోనా విజృంభిస్తుంది. అన్ని రాష్ట్రాలను వణికిస్తుంది. ఏపీ కూడా కరోనా భయం గుప్పిట్లో ఉంది. దేశం మొత్తం మీద రోజు 3 లక్షల కేసులు నమోదవుతుండగా.., ఏపీలో రోజుకి 11 వేల కేసుల వరకు వస్తున్నాయి. ఆక్సిజన్ అందక.., ఊపిరాడక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కి కరోనా టీకా వేయించడం ఒక్కటే మార్గం. టీకా వేయిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. కాస్త త్వరగా నయమవుతుంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఏపీలో 18 ఏళ్ళు నిండిన అందరికీ ఉచితంగా వాక్సిన్ వేయిస్తామని ప్రకటించింది. దీనిపై ఓ పోలీసు ఉన్నతాధికారి ముందుకొచ్చారు. తన వంతుగా ఒక నెల వేతనాన్ని కరోనా ఉచిత వాక్సిన్ సహాయార్ధం ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ఆయన ప్రకటించారు.
AP CID: ఏపీ సీఐడీలో ప్రత్యేక ముద్ర..!!
ఏపీలో సీఐడీ అదనపు డీజీగా పీవీ సునీల్ కుమార్ ఉన్నారు. కొంత కాలంగా సీఐడీ కేసుల ఛేదనలో.., నేర శోధనలో జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలుస్తుంది. ఆ అధికారి ఇప్పుడు కరోనా టీకాల సహాయార్ధం ముందుకొచ్చి అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. “రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ ఉచితంగా కరోనా టీకా వేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇది లక్షలాది మంరి ప్రాణాలు నిలబెట్టే ఒక మహత్తర కార్యక్రమం. దీనిలో భాగంగా ఉండాలని నేను నా నెల రోజుల వేతనం రూ. 3,08,992 ని కరోనా టీకా సహాయార్ధం ప్రభుత్వానికి ఇస్తున్నాను. ఇది మనందరి బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. దీనిపై పోలీసు శాఖ నుండే కాకుండా ఇతర శాఖలు, ఉద్యోగుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి..!