అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తొలి సారిగా అమెరికా పర్యటనకు కుటుంబ సమేతంగా వెళుతున్నారు. ఆగష్టు 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు వారం రోజుల పాటు జగన్ అమెరికాలో పర్యటిస్తారు.
ఆగస్టు 17న నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత డల్లాస్లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడా జగన్ పాల్గొంటారని సమాచారం.