అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష జరపాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తప్పుబడుతూ ప్రకటన విడుదల చేసింది.
సాంప్రదాయేత ఇంధన వనరుల సంస్థలు 5.2 గిగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్నాయనీ, ఈ కంపెనీలపై 21వేల కోట్ల రూపాయల రుణ భారం ఉందని క్రిసిల్ పేర్కొంది.
ఏపి ప్రభుత్వం పిపిఎల సమీక్షించాలని డిమాండ్ చేసిన పక్షంలో ఈ సంస్థలపై ఆర్థిక పరమైన ఒత్తిడులు పెరుగుతాయని తెలిపింది. ఈ పిపిఎల సమీక్ష వల్ల విద్యుత్ తయారీ సంస్థల మనుగుడ ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉందని క్రిసిల్ వ్యాఖ్యానించింది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పిపిఎల వెనుక చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఈ ఒప్పందాలను సమీక్షించి ధరలను తగ్గించడం కోసం జూలై ఒకటిన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 45రోజుల్లో ఈ కమిటీ నివేదక సమర్పించాల్సి ఉంది.
పవన, సౌర విద్యుత్ సరఫరా ధరలను తగ్గించాలని కమిటి సిఫార్సు చేసిన పక్షంలో ఈ ఉత్పత్తి రంగం కూదేలు అవుతుందని క్రిసిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పిపిఎల సమీక్షకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.
నవ్యాంద రాజధాని అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పన, వివిధ సదుపాయాల అభివృద్ధికి రుణం మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కు తగగ్గడం, అనంతరం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) అదే దారిలో పయనించడం కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మరాయి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ రేటింగ్ సంస్థ క్రిసిల్ కూడా జగన్ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడం మరోక షాక్గా పరిణమించనుంది.