చిరు ఆధ్వర్యంలో కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దల మీటింగ్ అనంతరం బాలయ్య ఫైరయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆ మీటింగుకు వెళ్లినవారు పెద్దగా స్పందించకపోయినా.. నాగబాబు మాత్రం కాస్త హడావిడి చేశారు.. విషయం పెద్దది అవుతుందేమో అనుకున్న సమయంలో.. అంతా సద్దుమణిగిందనే చెప్పాలి. దీనికి తెరవెనక ఏమి జరిగిందనేది ఇప్పుడు అప్రస్తుతం. ఈ క్రమంలో చిరు ఆధ్వర్యంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం ని కలవబోతున్నారు.
ఈ నెల 9వ తేదీన చిరు ఆధ్వర్యంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు ఆహ్వానం అందిందట. కానీ బాలయ్య ఈ మీటింగుకు హాజరు కాలేనని చెప్పారని తెలుస్తుంది. ఈ విషయం చిరు & కో ముందుగా ఊహించిందే అని అంటున్నారు సినీ జనాలు. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. అందులో ఒకటి… జూన్ 10న బాలయ్య బర్త్ డే కాగా.. మరోకటి జగన్ విషయంలో బాలయ్య ఈ మీటింగ్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరు కారని నమ్మకం అంట! నిజం చెప్పాలంటే… బాలయ్యకు బర్త్ డే అనేది చిన్న కారణమే అని.. బాబు అంటే ఉన్న భయమే పెద్ద సాకని అంటున్నారు! మరి బాలయ్య ఏ కారణంతో ఇంత ప్రాముఖ్యమైన మీటింగ్ కు హాజరుకాకుండా ఉంటున్నారనేది కాలమే చెప్పాలి.
అయితే… “భయమా.. నాకా.. అది నా ఇంటి కుక్కకు కూడా తెలియదు” అనేది బాలయ్య సినిమా డైలాగ్! ఇది సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా బాలయ్య పద్దతి ఇంతే అని కొందరంటుండగా… అంతవరకూ కరెక్టే కానీ.. రాజకీయాల్లో మాత్రం కాదు, బాబు దగ్గర అస్సలే కాదు అని ఇంకొందరు అంటున్న మాటకు ఈ సందర్భంగా బలం చేకూరుతుందని అంటున్నారు. ఈ సంగతులు అలా ఉంటే… ఈ విషయంలో నెలకొన్న వివాదానికి చెక్ పెట్టాలని బాలయ్య బావిస్తున్నారంట. అందులో భాగంగానే తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు చిరంజీవిని కూడా ఆహ్వానించబోతున్నారంట.
ఆ ఆహ్వానల సంగతి అలా ఉంచితే… బాలయ్య మాత్రం జగన్ తో మీటింగ్ కు హాజరుకావడం లేదనేదే హాట్ టాపిక్ అవుతుందని అంటున్నారు సినీ జనాలు! ఇంత ప్రాముఖ్యమైన మీటింగ్ కు బాలయ్య హాజరైతే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో “భయమా.. నాకా” అంటూ బాలయ్య తన మనసు మార్చుకుని తన వీరాభిమాని జగన్ తో మీటింగ్ కు హాజరవుతారా లేక… ఆ డైలాగులు సినిమాల వరకే అని అంటారా అనేది వేచి చూడాలి!