ప్రతి మహిళలను ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య నెలసరి. చాలా మంది అమ్మాయిలు తమ నెలసరి సమయంలో కడుపు నొప్పి మరియు నడుం నొప్పితో చాలా బాధపడుతుంటారు. ఈ వేదన వారికి నాలుగు రోజులపాటు ఉంటుంది. రుతుస్రావం వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరోన్ హార్మోన్ల స్థాయి తగ్గుతాయి. పోషకాహార లోపంతో ఈ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, నడుం నొప్పి మాటిమాటికీ కోపం రావడం, చిరాకు రావడం వంటివి జరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా అమ్మాయిల మూడ్ కూడా వెంట వెంటనే మారుతుంది.
కొందరు అమ్మాయిలకు నెలసరి నరకాన్ని చూపిస్తుంది. నెలసరికి వారం ముందు నుంచే తీవ్రమైన నొప్పిని వారు అనుభవిస్తారు. దీంతో పాటు కాలుష్యం మరియు మానసిక ఒత్తిడి నెలసరి నొప్పులను పెంచుతాయి. మరి మనల్ని వేధించే ఈ కడుపునొప్పి మారియు ఇతర సమస్యలను తగ్గించుకోవాలంటే? దీనికి పరిష్కారం ఉందని నిపుణులు చెబితున్నారు. అవి ఏమిటంటే…
- ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు నుంచి ఉపశమనం ఉంటుంది.
- నొప్పి ఉన్న చోట వేడినీళ్లు నింపిన హీటింగ్ ప్యాడ్తో కాపడం వలన మంచి ఫలితం ఉంటుంది.
- నెలసరి ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అయ్యి మీకు విశ్రాంతిని ఇస్తుంది.
- కొన్ని తులసి ఆకులని తీసుకుని, శుభ్రంగా కడిగి ఓ రెండు కప్పుల నీటిలో ఈ ఆకులని వేసి మరిగించుకుని. ఈ రసాన్ని రోజంతా కొద్దిగా తాగుతుండండి. దీని వల్ల పీరియడ్స్ టైమ్లో వచ్చే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు మరియుఇతర సమస్యలు తగ్గుతాయి.