Big Breaking : చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతం మావోయిస్టులు, జవాన్ల ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. భారీ ఎత్తున జరిగిన ఎదురుకాల్పులలో అయిదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తర్రం అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన 8 కేజీల ఐఇడీ బాంబును పోలీసు బలగాలు నిర్వీర్యం చేశారు.
అనంతరం అటవీ ప్రాంతంలో మవోయిస్టులకు, జవానులకు మధ్య భీకర కాల్పులు జరగగా అయిదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.