బిగ్ బాస్ హౌస్ లో తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దివి. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే దీవి దసరా ఎపిసోడ్ నాడు ఎలిమినేట్ అయ్యి సమంత ఆధ్వర్యంలో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇదిలా ఉండగా బయటకి వచ్చిన దివి ప్రస్తుతం ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. ఇంత తొందరగా బయటికి వచ్చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు, అది దసరా రోజు ఎలిమినేట్ కావడం చాలా బాధనిపించింది అని తెలిపింది. కానీ నేను ఎలా లోపలికి వెళ్లానో అలాగే బయటికి వచ్చేశాను… బిగ్ బాస్ హౌస్ అనేది ఒక కళ, ఒక డ్రగ్ అందులో ఎప్పుడూ..? ఎలాగా..? ఏం జరుగుతుందో..? ఎవరికీ తెలీదు అని పేర్కొంది.
ఇక ఇంటిలో అనేక విషయాల గురించి తెలిపిన దీవి… బయటకు వచ్చాక ఇంటిలో ఉన్న సభ్యులందరి తో ఫోన్లో మాట్లాడటం జరిగిందని…. కానీ ఆ కంటెంట్ ఎపిసోడ్ ప్రసారం చేయలేదని పేర్కొంది. ముఖ్యంగా ఒక టాస్క్ లో భాగంగా పేడ ఉన్న తొట్టిలో 3 గంటలు కూర్చోవటం జీవితంలో మర్చిపోలేను అని పేర్కొంది. హౌస్ లో పెద్దగా ఎవరితో కనెక్షన్ లేకపోయినా అమ్మరాజశేఖర్ అంటే గౌరవం ఉందని… ఆయన ఆట వల్ల నేను ప్రభావితం అయితే కాలేదని తెలిసింది.
ఇదిలా ఉండగా ఇంటి సభ్యులందరి లో అభిజిత్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని అది బోట్ ఆటలో బయటపడిందని, జనాలు ఖచ్చితంగా నేను సేవ్ చేస్తారు అనే కాన్ఫిడెంట్ తో పడవ టాస్క్ లో నుంచి దిగటం నాకు నచ్చలేదు, ఇదే విషయాన్ని నాగార్జునసాగర్ కూడా ప్రస్తావించారు అని పేర్కొంది. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయని… నటిగా మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో వస్తాయని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది దీవి.