బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. ఇంటిలో 19 మంది సభ్యులు వైల్డ్ కార్డు తో కలిపి ఎంటర్ అవ్వగా ఐదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. అభిజిత్, హారిక, అఖిల్, సోహైల్, అరియనా. వీరిలో ఓటింగ్ పరంగా చూసుకుంటే మొదటినుండి అభి అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. దాదాపు ఈ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ మొదటి నుండి అభి అని అంటున్నారు.
ఆ తరువాత సోహెల్ పేరు అదేవిధంగా అఖిల్ పేరు వినబడుతోంది. ఇదిలా ఉంటే రన్ అవుతున్న బిగ్ బాస్ చాలా వరకు టాస్క్ లు గాని ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ… గతంలో ఉన్న వాటి తరహాలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో హౌస్ లోకి ఎలిమినేట్ అయిన 14 మంది కంటెస్టెంట్ లు రావటం గ్యారెంటీ అని అదే ఈ వారంలో హైలెట్ అవుతుందని బిగ్ బాస్ ఆడియన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
గతంలో ఇంటి సభ్యులు వచ్చిన మాదిరిగానే ఇంటిలోకి కాకుండా షో నిర్వాహకులు ఇంటి సభ్యులందరినీ హౌస్ లోకి తీసుకు రావడం గ్యారంటీ అని అంటున్నారు.అంతేకాకుండా ఈసారి టైటిల్ విన్నర్ ప్రకటించడానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ కుర్ర యాక్టర్ నీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్ టైటిల్ విన్నర్ ప్రకటించడానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. మరి ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారో ఎవరు అతిథిగా వస్తారో చూడాలి.