తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్బాస్ సీజన్ ఫోర్ ఆఖరి అంకానికి చేరింది. ఇంకో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో.. ఇంటిలో సభ్యులు గెలవడం కోసం భారీ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఎవరికివారు స్ట్రాటజీలు వేసుకుంటూ ఉంటే మరోపక్క బిగ్ బాస్ ఇంటి సభ్యుల స్ట్రాటజీలు చిత్తు అయ్యేలా… హౌస్ లో రకరకాల గేమ్ లు ఇంటి సభ్యుల చేత ఆడిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా టికెట్టు ఫినాలే రేస్ లో ఇంటి సభ్యులు ఆవు దగ్గర పాలు పిత్తు కోడానికి రకరకాల ఫీట్లు పడుతున్నారు. ఈ తరుణంలో ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులు ఎవరికి వారు గెలవటానికి పాలు పితికోటానికి… కొట్టుకునే తరహాలో ఇతర సభ్యులతో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో టికెట్టు ఫినాలే మెడల్ కోసం అఖిల్, సోహెల్ ఇద్దరు ఒకటైపోయి… మిగతా ఇంటి సభ్యులను తోసేసి మరి ఆవు దగ్గర పాలు పంచుకోవటానికి రెడీ అయినట్లు అర్థమవుతుంది.
మొత్తంమీద చూసుకుంటే వీరిద్దరూ హౌస్ లో బలంగా ఉండటంతో మిగతా ఇంటి సభ్యులకు ఈ టాస్క్ లో చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమం లో రిలీజ్ అయిన ప్రోమో బట్టి చూస్తే అవినాష్ కి సోహెల్ మధ్య గొడవ అయినట్లు తెలుస్తోంది. అయితే అవినాష్ వాళ్లతో గొడవలు పడలేక డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు కదా అంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా వేయడం తో ఈరోజు హౌస్ లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఆడియన్స్ లో నెలకొంది.